శాస్త్రీయ దృక్పథం

విజ్ఞానశాస్త్ర అభిమానులకు "విజ్ఞానశాస్త్రము"బ్లాగు స్వాగతం ఈ బ్లాగు ప్రజలలో,విద్యార్థులలో ఉపాధ్యాయులలో శాస్త్రీయదృక్పథాన్ని పెంచుటకు ఉద్దేశించబడినది.

Sunday 26 August 2012

రోదసియానం(ఆడియో)

          విజ్ఞాన శాస్త్రంలోని పలు అంశాలపై మార్కాపురం radio station వారు నా తో జరిపిన సంభాషణలలో మొదటిది  అయిన "రోదసియానం"  ఈ లింక్ లో వినగలరు.ఈ కార్యక్రమాన్ని నాతో జరిపిన  శ్రీ మహేష్ గారికి ధన్యవాదాలు. మొత్తం 12 episodes గా ప్రసారం అయిన వీటిని ఇచ్చి నన్ను ప్రోత్సాహించిన శ్రీ మహేష్ గారికి సాంకేతిక  సిబ్బంది అయిన శ్రీ నరసింహారావు గారు,తదితరులకు నా కృతజ్ఞతలు.వీటిని తరువాత  ఈ బ్లాగులో పోస్ట్ చేస్తాను.      
http://www.4shared.com/music/Xyi7EIzn/1RODASIYANAM-EDITED.html

Sunday 19 August 2012

అంగారక గ్రహం(mars) విశేషాలు


       ఈ మధ్య curiocity అంగారకుని పైకి వెళ్ళిన తరువాత అందరి దృష్టి అంగారకుని వైపు మళ్ళింది.ఇది ఆకాశంలో ఎర్రగా కనబడుతుంది.ఇనుము oxide రూపంలో ఉండటం వలన అలా కనపడుతుంది.భూమి తరువాత కుజ గ్రహం పై జీవం ఉండవచ్చునని శాస్త్రజ్ఞులనమ్మకం.1964 లో merinar -4,అనే రోదసీ నౌక కుజుడి ప్రక్కనుండి ప్రయాణించిం ది.1976  లో అమెరికా ప్రయోగించిన vyking  నౌకలు తొలిగా కుజుడి మీదకు దిగి ఆరేళ్ళపాటు వర్ణ చిత్రాలను  ప్రసా రం చెయ్యగలిగాయి.1988, లో రష్యా కుజుడి ఉపగ్రహాలైన ఫోబోస్,daimose ల కోసం ప్రయోగించ బడ్డాయి. hubble telescope  సహాయంతో కుజుడిని ఫొటోలు తీస్తున్నారు.దీని యొక్క సరాసరి వ్యాసం 6780km భూమితో  పోలిస్తే సగం,చంద్రునితో పోలిస్తే రెట్టింపు ఉంటుంది.భూమిలో 10 వ వంతు ద్రవ్య రాశిని కలిగి ఉంటుంది.భూమితో పోలిస్తే 38%  గురుత్వాకర్షణ   శక్తి కలిగి ఉంటుంది.నీటికన్నా 3.9 రెట్లు ఎక్కువ సాంద్రత కలిగి ఉంటుంది.భూమి సాంద్రత నీటి కన్నా 5.5 రెట్లు ఎక్కువ.
       అయ స్కాంత క్షేత్రం గ్రహమంతా విస్తరించి లేదు.ఇది సూర్యుడి నుండి దూరంలో నాలుగవది.భూమి తర్వాత ఉంటుంది .సూర్యుడి నుంచి 23 కోట్ల కి.మీ సూర్యుడి చుట్టూ తిరిగి రావటానికి 320  రోజులు  పడుతుంది వాతావ రణం లో 95%,co2 3% nitrogen,1.6% organ ఉంటాయి.దీని ఆత్మ భ్రమణ కాలం24 గంటల  39 నిమిషాల  35 సెకండ్స్ .సౌర వ్యవస్థలో అన్నింటికన్నా ఎత్తయిన శిఖరం కుజుడి మీద ఉంది.olympus mones ఒక చల్లారిన అగ్ని పర్వతం.ఇది evarest కు మూడింతలు ఉంటుంది.ద్రువాలు 25 డిగ్రీలు   ఒరి గి ఉండటం వలన రుతువులు ఏర్పడ తాయి.ఉపరితల వాతావరణ పీడనం భూమితో పోలిస్తే 1/100 వ వంతు ఉంటుంది.ఉపరితల గాలులు గంటకు 0-20 మైళ్ళ వేగంతో వీస్తుంటాయి.ధూళి తుఫాన్స్ వస్తుం టాయి.ఉపరితలం పై సరాసరి ఉష్ణోగ్రత -55 డిగ్రీల  సెల్సియస్  ధ్రువ  ప్రాంతాల్లో  రాత్రి  పూట  -128 డిగ్రీల  celsius  ఉష్ణోగ్రత ఉంటుంది.పగటి సమయంలో అంగారక మధ్య ప్రాంతం లో 27 డిగ్రీలు ఉంటుంది.
      కుజుడి పై ఉల్కలు డీ కొట్టిన క్రేటర్ సాక్ష్యాలు ఎక్కువే.లోయలు పెద్దవే నాలుగు వేల కి.మీ లోతు ఉన్నవి ఉన్నా యి.భూమి మీద కదిలినట్లుగా ఫలకాలు ,plate tectanics ప్రక్రియల ద్వారా కదలడం వంటిది కుజుడి మీద కనబడ దు.అగ్నిపర్వతాలు ప్రవహించిన గురుతులున్నాయి.ఉల్కా పాతాల గోతులు కనిపిస్తాయి.కుజుడి పై సగటు ఉష్ణోగ్రత -55  డిగ్రీలు.ఉష్ణోగ్రత  -133 నుండి  27 డిగ్రీలు  వుంటుంది .భూమి తరువాత జలరాశి,జీవ కణాల ఉనికికి కుజుడి మీద అవకాశం ఉందని భావిస్తున్నారు.ధ్రువాల్లో మంచు గడ్డ కట్టి కనిపిస్తుంది.గతంలో నీరు వరదగా పారిన దాఖలా లు నదీశయ్యా ప్రాంతాలు కనిపిస్తున్నా యి.నీరుంటే తప్ప రూపొందలేని hematite వంటి ఖనిజాల జాడ తెలిసింది కుజుడి పైనుండి భూమి పైకి పడ్డ ఉల్కలో సేంద్రియ పదార్థాలు ఉండటం ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి మార్స్ పైకి pathfinder, spirit, sojourner వంటి కొన్ని ప్రయోగాలు జరిగాయి.ఇవి కుజుడి పై దిగి ఫొటోస్ తీసాయి.కుజుడి పైకి మనుషు లు వెళ్ళే ప్రయోగాలు అమెరికా ప్రారంభించింది.కాని దానికి మరో పాతిక సంవత్సరాలు పట్టవచ్చు.ప్రస్తుతం జరిగిన ఈ curiocity ప్రయోగం దానికి బాటలు వేస్తుందని ఆశిస్తున్నారు.

Wednesday 8 August 2012

అంగారకుని పై జీవాన్వేషణ


                 అంతరిక్ష పరిశోధనల్లో  అత్యంత అధునాతనమైన వ్యోమ నౌక /రోవర్ curiocity  సోమవారం       ఉదయం11 గంటలకు అంగారకుని పై దిగింది.NASA లోని జెట్ ప్రొపల్షన్ laboratory లో శాస్త్ర వేత్తలు ఒకరినొకరు హత్తుకొని ఆనందంతో పొంగిపోయారు.గతంలో ఎప్పుడైనా జీవం ఉనికిలో ఉందా!భవిష్యత్తు లో జీవం ఉనికి లో ఉండటానికి అవసరమైన పరిస్థితులు అక్కడున్నాయా!వంటి ప్రశ్నలకు ఇది సమా ధానం కనుగొనబోతుంది.దిగిన కొద్ది సేపటికే చిన్న సైజు ఫోటోను ,మరొక భారీ సైజు ఉన్నమరో  ఫోటోను  పంపించి అక్కడి మట్టిని,రాళ్ళను భూమి పైకి తీసుకు వచ్చి వాటిని పరీక్షించి project లకు  వ్యోమగా ముల్ని అక్కడికి పంపించాలన్నఆలోచనకు మార్గం వేయనుంది.జీవం ఉనికికి అత్యవసరమైన  corbon,nitrogen,phospurus,sulphur,oxygen వంటి మూలకాలను ఇది అన్వేషిస్తుంది.
           ఈ వ్యోమ నౌక plutonium వేడి నుంచి పుట్టే విద్యుత్తు ద్వారా పనిచేస్తుంది.ఇందులో భారత శాస్త్ర వేత్తలు అశ్విన్,అమితాబ్ ఘోష్,అనితాసేన్ గుప్త,రవి ప్రకాష్ పాల్గొన్నారు.ఇందులో అశ్విన్ ఈ యాత్రకు deputy project scientist గా ఎదిగారు.రానున్న రోజుల్లో ఆయన నేతృత్వం లోని శాస్త్రవేత్తల బృందం దాదాపు 400 మంది అంగారకుడిపై లోగడ ఎప్పుడైనా జీవం ఉనికికి అనువైన  పరిస్థితులు ఉన్నాయా,  లేవా అని తేలుస్తుంది.ఇప్పటి వరకు అంగారకుని పైకి మేరైనర్ 4,6,7,9 vyking1,2 mars global surveyor,odissee ,mars express,mars pathfinder,mro,spirit,opportunity,feeniks వంటి అనేక రోబోటిక్ యాత్రలు జరిగాయి.

Saturday 4 August 2012

అంగారక గ్రహం పైకి curiocity


           ఈ విశ్వంలో భూమి మీద తప్ప మరెక్కడా జీవం ఉన్న ఆధారాలు మనకు దొరకలేదు.మన సౌర కుటుం బంలోజీవం మనుగడ సాగించడానికి కొంత మేరకు అనువైనది అంగారక గ్రహమని భావిస్తున్నారు ఒకప్పుడు ఇక్కడ నీరు ఉండేదని ,జీవుల మనుగడకు అనుకూల పరిస్థితులు ఉండేవని అనుకుంటున్నారు.USA వారిNASA   26/11/2011  తేదీన  ఫ్లోరిడా లోని cape canavaral వైమానిక స్థావరం నుండి అంగారక గ్రహం పైకి "curiocity"అనే rovar ను ప్రయోగించింది.ఇది 5.6 కోట్ల కిలోమీటర్స్ దూరం ప్రయాణించి సోమవారం అంగారక గ్రహం పైకి దిగనుంది. .నీటి ఆనవాళ్ళున్నగేల్ బిలం లోకి దీన్ని దించుతున్నారు.ఇది ఒక సంచార ప్రయోగశాల.శిలలను చూసి,నేలను త్రవ్వి జీవం ఆనవాళ్ళను పసిగడుతుంది.దీనిలో నీటిని గుర్తించే పరికరాలు,ఆధునిక కెమెరాలు ఉన్నాయి.ఇది 900 కిలోగ్రాముల బరువు కలిగి ఉంది.దీన్ని నిర్మించటానికి 250 కోట్ల dollars ఖర్చు అయ్యాయి .గంటకు 13 వేల మైళ్ళ వేగంతో అంగారకుడి వాతావరణంలోకి దూసుకు వచ్చి ఏడు నిమిషాల వ్యవధిలో దానిపై దిగాలి.రాకెట్ సాయంతో పనిచేసే skycrane ద్వారా ఈ రోవర్ ను క్రిందికి దించుతారు.