శాస్త్రీయ దృక్పథం

విజ్ఞానశాస్త్ర అభిమానులకు "విజ్ఞానశాస్త్రము"బ్లాగు స్వాగతం ఈ బ్లాగు ప్రజలలో,విద్యార్థులలో ఉపాధ్యాయులలో శాస్త్రీయదృక్పథాన్ని పెంచుటకు ఉద్దేశించబడినది.

Saturday 26 October 2013

కొత్త ఆలోచనలను ఆహ్వానించడమే శాస్త్రీయ దృక్పథం ...... N.Vital c.v.c మాజీ chairman

శాస్త్రీయ దృక్పథాన్ని అర్థం చేసుకోవాలంటే ముందుగా మానవ పరిస్థితులను,సమాజానికి మతానికీ  మధ్య  ఉన్న  సంబంధాల  గురించి  తెలుసుకోవాల్సి  ఉంటుంది.science రుజువులను కోరుతుంది.ప్రతిదాన్ని తార్కికంగా విశ్లేషిం చేందుకు ప్రయత్నిస్తుంది.అన్నిటిని  ఇతర జీవులతో వేరు చేసేవి 3 అంశాలు 1) నేర్చుకోగల సామర్ద్యం 2),విశ్లేషించ గలగడం 3)కొత్త అంశాలను కనుగొనగలగడం.చింపాంజీ మెదడు రెండు మూడేళ్ళలో ఎదిగితే మానవ మెదడు ఎది గేందుకు పదేళ్ళు పడుతుంది.బహుశా ఇందు వల్లనే మానవుడికి  ఇంత సమర్ధత  అబ్బిందేమో ? మతానికి సైన్సు కు ఉన్నసంబంధం యుగాలనాటిది.గెలీలియో ఆవిష్కరణను అప్పటి మత పెద్దలు ఎలా వ్యతిరేకించింది మనకు తెలిసిందే.అయితే  గతిశీల సైన్సు ఎప్పుడు మారుతూనే ఉంటుంది.
  .
        

Thursday 24 October 2013

సైన్స్ లో శాశ్వత సత్యమంటూ లేదు ....రాజా రామన్న, సైంటిస్ట్

ఎన్నో సందేహాలు
ఎన్నో సంతాపాలు
జీవితంపు  చిక్కుముడులు
విడవెంతగ  సడలించిన ...
           ***
ఈ సృష్టికి ఏమర్థం  
మానవుని గమ్యమేది?
ఒక సకలాతీత శక్తి ఉన్నట్టా లేనట్టా

మెదడదన్నది మనకున్నది
అది సరిగా పనిచేస్తే
విశ్వ రహః పేటికా వి
పాటన  జరగక తప్పదు ...
                                     --శ్రీ శ్రీ
                                                  సైన్స్ లో  శాశ్వత సత్యమంటూ లేదు
                                                                    .........రాజా రామన్న సైంటిస్ట్ , మాజీ రక్షణ శాఖా మంత్రి
             సైన్స్ అన్నది ఎప్పుడు మారుతూనే  ఉంటుంది. ప్రతి యుగం లోను ఈ మార్పు మనకు ప్రస్పుటంగా కన్పిస్తుంది. శాశ్వత సత్యం అన్న భావనకు ఇక్కడ స్థానం లేదు.నా దృష్టిలో కొత్త ఆలోచనలను స్వీకరించే మనస్తత్వమే శాస్త్రీయ దృక్పథం . అయితే  మన దేశ ప్రజల్లో శాస్త్రీయ దృక్పథం ఉందా?అన్న ప్రశ్న వేసుకుంటే సంతృప్తికరమైన సమాధానం దొరకదు.ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటి విద్యా వ్యవస్థ కొనసాగుతూ  ఉండటం  విద్యార్థులు అంశాలను అర్థం చేసు కోకుండా వాటిని బట్టీ పట్టడం దీనికి కారణాలు శాస్త్ర రంగంలో అభివృద్ది అన్నది ఎవరికీ ఉపయోగపడుతోందన్న విషయాన్ని ఎప్పుడూ గమనించాలి. 

Tuesday 22 October 2013

కొందరు మహనీయుల శాస్త్రీయ దృక్పథం

         .శాస్త్రీయ దృక్పధానికి పునాదులు వేసిన కొందరు మహనీయుల సాధన ,అనుభవాలు,ఆలోచనలు

ఐజాక్ న్యూటన్(1642-1727)
            ప్రపంచానికి నేనెట్లా కనిపిస్తానో తెలియదు కానీ నా మటుకు నేను సత్యం అనే సాగరం ముందు ఆడుకుంటూ ,ఏ గుండ్రటి గులకరాయినో ,అంద మైన గవ్వనొ  ఏరుకునే బాలునిగానే భావిస్తాను.

సి.వి రామన్ (1888-1970):
      నుదిటి  నుంచి  స్వేదం చిందకుండా చేసే పనికి విలువ లేదు.భారతీయ  మేధ  ఏ ఒక్కరికి తీసి పోదు. కానీ మనకు ధైర్యం పాలు తక్కువ. దేశంలో యువతకు కావలసింది అపజయాన్ని చవిచూస్తానన్న భయాన్ని శాశ్వతంగా నిర్మూలించడం ,విజయాభిలాషను పెంపొందించుకోవడం".    

రవీంద్రనాథ్ టాగూర్(1861-1941):
  ఈ అనంత విశ్వం తన రహస్యాలను తనలోనే ఇముడ్చు కోవాలని  ప్రయత్నిస్తుంటుంది కాని మానవుడు సామాన్యుడు కాదు. విశ్వం విసిరిన  సవాళ్ళను స్వీకరించి సృష్టి రహస్యాలను బహిర్గత పరిచి ,విశ్వం పై విజయం సాధించాడు .ఈ ప్రస్తానం లో  అనంత దూరాలను తనకు  దగ్గరగా  తెచ్చుకున్నాడు .కనరాని   శక్తులను వీక్షించాడు. వివరించలేని  ప్రక్రియల విశ్లేషణకు ఒక భాషను ఏర్పరుచుకున్నాడు .ఈ  సంకల్పం నెరవేరడానికి కావలిసిన అభిలాష భూమిపై కొందరికే ఉంటుంది .

జవహర్ లాల్ నెహ్రు(1889-1964):
               సుదీర్ఘ మైన చరిత్రలో మానవ జీవితం పై సైన్స్ చూపినంత ప్రభావాన్ని మరేదీ చూపలేదని నా నమ్మకం . సైన్స్ మనలను అనూహ్య మైన తీరాలకు తీసుకుని వెళ్ళింది .క్షీణ   దశలో ఉన్న ఆర్థిక వ్యవస్థను సమృద్ధి దిశగా రూపాంతరం చెం దిం చగల  సామర్థ్యం సైన్స్లు కు ఉన్న సంగతి అందరికీ తెలి సిందే ఇన్నాల్లూ తత్వ శాస్త్ర పరిధిలోని విషయాలు సైన్స్ పరిధి లోకి వచ్చాయి.స్థల కాలాల (space-time) భావన క్వాంటం సిద్ధాంతం భౌతిక ప్రపంచ అవగాహనలో మార్పు తెచ్చాయి.శాస్త్ర  అవగాహనతో మానవుడు తననూ  ప్రకృతినీ వేర్వేరుగా భావించడం లేదు.  మానవుని  తుది గమ్యం ప్రకృతిలోని శక్తులతో ముడి వడి ఉంది.

ఆల్బర్ట్ ఐన్ స్టీన్ (1879-1955):
సత్యాన్వేషణలో సైన్స్ ఇంకా బాల్య దశలోనే ఉంది ..కాని ఇంత వరకు సైన్స్ ద్వారా మనకు లభించిన విజ్ఞానం ఎంతో విలువైనది.

Saturday 12 October 2013

దైవ కణం(హిగ్స్ బోసాన్) ప్రతిపాదనకు ఫిజిక్స్ లో నోబెల్ ప్రైజ్


            2013 సంవత్సరానికి ఫిజిక్స్ లో నోబెల్ ప్రైజ్  దైవ కణం గురించి ప్రతిపాదించిన పీటర్  హిగ్స్,ఇంగ్లర్ట్ లకు లభించింది.1964 లో వీరితోపాటు robert brout కూడా ఉన్నారు తరువాత  పీటర్ర్ హిగ్స్ విశేష పరిశోధన చేసారు వీరితొ  పాటు కార్ల్ హెగెన్,గెరాల్డ్, టామ్ కిబ్ల్ కూడా దీని ఉనికిని ప్రతిపాదించారు.
             కానీ గమనించాల్సిన ముఖ్య విషయమమేమంటే మన దేశానికి చెందినా సత్యేంద్రనాథ్ బోస్ ఈ కణం ఉనికిని 1926  ప్రాంతంలోనే ప్రతిపాదించారు.ఈయన పేరుతోనే దీనికి బోసాన్ అనిపేరు వచ్చింది.
          ఈ కణం నుండే సృష్టిలోని గ్రహాలూ,నక్షత్రాల వరకు సమస్త పదార్దానికి ద్రవ్యరాశి చేకూరుతుంది.
 స్విట్జర్లాండ్ లోని సెర్న్ ప్రయోగశాల శాస్త్రవేత్తలు ఈ కణం ఉనికి నిజమని నిరూపించారు.