శాస్త్రీయ దృక్పథం

విజ్ఞానశాస్త్ర అభిమానులకు "విజ్ఞానశాస్త్రము"బ్లాగు స్వాగతం ఈ బ్లాగు ప్రజలలో,విద్యార్థులలో ఉపాధ్యాయులలో శాస్త్రీయదృక్పథాన్ని పెంచుటకు ఉద్దేశించబడినది.

Saturday 16 November 2013

విదేశాల్లో భారత ఆణిముత్యాలు


1) క్వాంటం కంప్యూటింగ్:   ఉమేష్ వజిరాని దీనిపై పరిశోధనలు చేస్తున్నారు.క్వాంటం కంప్యూటర్లు సిలికాన్ చిప్ లతో కాకుండా హైడ్రోజెన్ అణువులతో పనిచేస్తాయి.

2) విశ్వం ఎలా పుట్టింది?:  శ్రీనివాస కులకర్ణి లాస్ ఏంజెల్స్  దగ్గరలోని kaaltech యూనివర్సిటీ లో ఆస్ట్రో ఫిజిక్స్ శాస్త్ర వేత్తగా పనిచేస్తున్నారు.విశ్వం పుట్టుక రహస్యాన్ని చేధించటానికి గామా కిరణాల గురించి పరిశోధనలు చేస్తున్నారు.

3)మూర్చ : Dr హితేన్ జవేరీ మూర్చను నియంత్రించటానికి pacemaker లాంటి సాధనాన్ని కనిపెట్టాలనే లక్ష్యం  తో పనిచేస్తున్నారు.
 
4) మనుషులకు జంతువులకు మధ్య తేడా!: ఈ తేడాను వివరించేందుకు తద్వారా మానవ పరిణామం లోని చిక్కుముడులు విడగొట్టెందుకు కాలిపోర్నియా యూనివర్సిటీ కి చెందినా అజిత్ వర్కీ  ప్రయత్నిస్తున్నారు. ఇందుకై ఆయన తనపైనే ప్రయోగం చేసుకున్నారు.ఈ అధ్యయనానికి గ్లైకో బయాలజీ అనిపేరు పెట్టారు .

5) అతి సూక్ష్మ మైన జెట్ ఇంజెన్స్ ద్వారా ఎలెక్ట్రానిక్  పరికరాలకు విద్యుత్ ను అందించే టెక్నాలజీ ని అమిత్ మెహ్రా రూపొందిస్తున్నారు. ఇది ఇంధనం లోని రసాయన శక్తిని విద్యుత్ గా మారుస్తుంది.

6) మందుల అభివృద్ధిలో పేరు పొందిన ఖోస్లా ప్రస్తుతం స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ లో celiac sprue  అనే ఆటో ఇమ్యూన్ జబ్బుపై పరిశోధనలు  పెట్టారు .

7) శరీరం లోకి చిన్న చిన్న క్యాప్సుల్స్ నిర్దేశించిన  మందులు వదిలేసే అంశం పై పరిశోధిస్తున్నారు,మల్లాప్రగ్గడ  సూర్య .ఈమెను  100 మంది అత్యుత్తమ ఆవిష్కర్తల్లో ఒకరిగా MIT ప్రస్తుతించింది. మధుమేహ రోగులకు ఇంజెక్షన్ల బాధ  తప్పించేందుకు బోస్టన్ యూనివర్సిటీలో biomedical ఇంజినీరింగ్ లో  ప్రొఫెసర్ గా ఉన్న తేజాల్ దేశాయ్ ప్రయత్నిస్తున్నారు.

8)Activematerials పై  ప్రొఫెసర్ కౌశిక్ భట్టాచార్య పరిశోధనలు ప్రపంచ ప్రఖ్యాతి నార్జించి పెట్టాయి లోహాలలో ఉన్న PATERN ను మార్చి మనకు నచ్చిన లోహాలను డిజైన్ చేసుకోగలమా? అని కాలిఫోర్నియా institute లో ప్రొఫెసర్ గా పని చేస్తున్న కౌశిక్ పరిశోధనలు ఫలిస్తే నానో టెక్నాలజీ రంగమే కొత్త మలుపు తిరుగుతుంది .

9) మెదడు ఏ విధంగా అభివృద్ది చెందుతుంది ?దీనిని ప్రభావితం చేసే అంశాలేమిటి? MIT లో బ్రెయిన్ and కాగ్నిటివ్ డిపార్టుమెంటుకు హెడ్ గా  పనిచేస్తున్న మృగాంక సుర్ చేసిన పరిశోధనలు కొత్త ఊపు నిచ్చాయి.

10) రోటో  వైరస్ చాలా ప్రమాదకరమైనది.ఈ విషయం పై టెక్సాస్ మెడికల్ సెంటర్ లో B.V.V  ప్రసాద్ పరిశొధిస్తున్నారు. 
  వీరందరి పరిశోధనలు ఫలించి నోబెల్ బహుమతులు పొందాలని ఆశిద్దాం .
(ఈ సమాచారం ఈనాడు పేపర్ నుండి సేకరించినది వారికి ధన్యవాదాలు )  

Friday 8 November 2013

నోబెల్ హుమతి పొందిన భారతీయులు

 1) రబీంద్రనాధ్  టాగూర్(1913,సాహిత్యం) :గీతాంజలి అనే కావ్యానికి ఆయనకు ఈ బహుమతి వచ్చింది. ఈ బహుమతి అందుకున్న తొలి భారతీయుడు ఈయనే !
2) సి.వి. రామన్ (1930,భౌతిక శాస్త్రం ); కాంతిని ప్రసరింపజేసి పదార్థాల ధర్మాలను గ్రహించ వచ్చని రామన్ ఎఫెక్ట్ ద్వారా నిరూపించారు.సైన్స్ రంగంలోనోబెల్ సాధించిన శ్వేతజాతీయేతరుడు ఈయనే !
3):హరగోబింద్  ఖోరానా (1968,వైద్య రంగం): జన్యువుల్లో జీవ సంకేతాలు ఏ క్రమంలో ఉంటాయో విశ్లేషించినందుకు ఈయన ఈ బహుమతి పొందారు. 
4)మదర్ థెరెసా(1979,శాంతి):పేదలకు వ్యాధిగ్రస్తులకు సేవలు అందించినందుకు శాంతి పురస్కారం అందుకున్నారు.
5)సుబ్రమనియం చంద్రశేఖర్(1983,భౌతిక శాస్త్రం ):ఈయన సి.వి రామన్ సోదరుని కుమారుడు.ఈయన ఖగోళ భౌతి క శాస్త్రంలో చంద్రశేఖర్ లిమిట్ పేరుతో ఓ సిద్దాంతాన్ని ప్రతిపాదించారు.నక్షత్రాల పుట్టుక,పరిణామాల పై ఇది వివరి స్తుంది.నాసా ఈయన పేరుతో ( చంద్ర ఎక్స్ రే) ఒక అబ్జర్వేటరీ ని ప్రయోగించింది.
6) అమర్త్యసేన్(1998,అర్థ శాస్త్రం): ఆర్ధిక సంస్కరణలకు ముందు జనసంక్షేమాలయిన విద్య,వైద్యం,ఆహార లభ్యత వంటివి సంస్కరించి నప్పుడే నిజమైన ఆర్ధిక పురోభివృద్ది సాధ్యమని ప్రభుత్వాలు,ఐక్యరాజ్య సమితి గుర్తించేలా చేయ్యటం వలన ఈ బహుమతి సాదించారు.
7)వెంకటరామన్ రామకృష్ణన్ (2009,రసాయన శాస్త్రం ): రైబోజోం  జీవానికి,శారీరక గమనానికి కణ స్థాయిలో అత్యంత కీలక మైన సంకేతం.దీని గుట్టుమట్లు విప్పినందుకు ఈ పురస్కారానికి ఎంపికయ్యారు .
8) వి.యెస్ నైపాల్ :(సాహిత్య్హం 2001) ఈయన భారతీయ సంతతి వారు.
9)ఆర్.కె పచౌరీ :నోబెల్ శాంతి బహుమతి అల్గోరెతో కలిసి పంచుకున్నారు.