శాస్త్రీయ దృక్పథం

విజ్ఞానశాస్త్ర అభిమానులకు "విజ్ఞానశాస్త్రము"బ్లాగు స్వాగతం ఈ బ్లాగు ప్రజలలో,విద్యార్థులలో ఉపాధ్యాయులలో శాస్త్రీయదృక్పథాన్ని పెంచుటకు ఉద్దేశించబడినది.

Saturday 26 September 2015

తరతరాల వంశ వృక్షం రెడీ

               మన పూర్వీకుల గురించి మనకే మాత్రం తెలుసు. మహా అయితే 4 తరాల వరకు తెలిసి ఉంటుంది .కనీసము 10,000 సంవత్సరాల నాటి మన పూర్వీకులు ఎవరో తెలుసుకోవాలంటే మాత్రం అమెరికాలోని oxford Ancestors కంపెనీని సంప్ర దిమ్చాల్సిందే .. మన శరీరం లోని జన్యు సమాచారం ఆధారంగా ఇది సాధ్యం అవుతుంది . జన్యు అమరికకు దగ్గరగా ఉండే జన్యువులు ప్రస్తుతం ఎక్కడ వున్నాయో  గుర్తిస్తే చాలు . మానవ జన్యువుల్లో తేడాలు  తక్కువ కాబట్టి తప్పుడు సమాచారం అందుతుందని  అనుకునేందుకు వీలు  లేదు . ఈ కంపెనీ Mitochondrial DNA విశ్లేసిస్తుంది.ee రకమైన ప్రక్రియను  వంశా వ్రుక్షాలను  తెలుసుకునేందుకు  ఉప యోగిస్తారు .
              ఆక్స్ఫర్డ్  University లో human genetics professor అయిన brain syx కు తన పూర్వీకుల గురించి తెలుసుకోవాలన్న కుతూహలం వల్లేMytocandrial DNA విశ్లేషణకు ప్రాధాన్యం లభించిందని చెప్పవచ్చు .ఈ పద్ధతిలో  జరిగిన  పరిశోధనలోsyx  తాను రష్యన్ చక్రవర్తి నికోలస్ 2 కు బంధువని తెలుసుకున్నాడు . ఆ తర్వాత oxford ancestor company ని స్థాపించాడు . తరాలు మారేకొద్దీ పూర్వీకుల సంఖ్య రెట్టింపవుతుంది . అంటే తల్లి తండ్రి ఇద్దరు ఒక తరం అనుకుంటే తాతల తరం వచ్చే నాటికి వీరి సంఖ్యా నాలుగుకు పెరుగుతుంది . ప్రత్యేకత ఏమిటి ? Mytocandrial DNA చాలా నెమ్మదిగా నాశనం అవుతుంటుంది .20000 ఏళ్లకు ఒకసారి ఇందులోని base pairs లో మార్పులు వస్తుంటాయి. అందు వల్లే  పురాతత్వ త్రవ్వకాలలో బయటపడే ఎముకలలో nuclearDNA నాశన మైన చాలా ఏండ్ల  తరువాత కూడా Mytocandrial DNA చాయలు కనిపిస్తాయి
                 syx ప్రతిపాదన ప్రకారం సుమారు 1,50,000 ఏళ్లకు ముందు ఆఫ్రికా ప్రాంతానికి చెందినా  ఒక మహిళా నివసించేది. ఆమె కెన్యా లేదా ఇథియోపియా ప్రాంతానికి చెందినది . అప్పట్లో నివసించిన మహిళా DNAనే తరువాత తరాలకు వారసత్వం గా వచ్చింది . ఈమెనే Mytocandrial ఈవ్ అన్నారు . ఆమె ఊహా చిత్రాన్ని కూడా తయారు చేసారు . కొన్ని వేల సంవత్సరాల అనంతరం ఆమె వారసులు ఆఫ్రికా ఖండం నుంచి ప్రపంచం నలుమూలలకు  వ్యాపించారు . వారు ఎ దిశగా ప్రయాణించారు ఎక్కడెక్కడ నివాసాలు ఏర్పరుచుకున్నారు అనే విషయం కనుగునే ప్రయత్నం లోsyx దాదాపు పదేళ్ళు గడిపాడు .దీని కోసం ఆయన కొన్ని వేల మంది Mytocandrial  sequence  లను పరిశీలించారు . ఆయన విశ్లేషణ ప్రకారం ఈవ్ సంతతికి చెందినా తెగలు ఆఫ్రికా  లో 13,మిగిలిన ప్రాంతం లో మరో 13 ఉన్నాయి . లక్ష సంవత్సరాల క్రితం ఈ తెగలు చిన్న చిన్న గుంపులుగా ఆఫ్రికా నుంచి తూర్పు ప్రాంతం వైపు వలస వెళ్లి ఆప్రాంతం లో దాదాపు 50000 సంవత్సరాలు  గడిపాయి . ఈ కాలం లో తెగల సభ్యుల   సంఖ్య  బాగా పెరిగిపోయింది. దానితో  పాటు Mytocandrial DNA లో మార్పులు కూడా జరిగాయి వీరిలో కొందరు యూరప్ లోకి వెళ్లి స్థిర పడ్డారు .
యురోపియన్స్ లో 95 శాతం మంది  7 Mytocandrial  తెగలకు చెందినా వారని syx  అంచనా .ఈ ఏడూ తెగలకు చెందినా తల్లులకు ఆయన హెలినా,జాస్మిన్,కేత్రీన్ తారా ,ఉర్సులా ,వెళ్దా ,జేనియా  అని నామకరణం చేసారు .
(  thanks to eenaadu) 

Friday 25 September 2015

ప్రాణ వాయువు పుట్టింది ఇలా !


                  భూమిపై ఒకప్పుడు ఆక్షిజన్ లేదు! ఉన్న కొన్ని ప్రాణులు సూర్య రశ్మి సాయం తో మనగలిగేవి. భూ   వాతావరణం ....ఈ దశ నుండి ఆక్షిజన్ ఆధారిత దశకు చేరిందేలా ?
           ఈ చిక్కుముడిని  విప్పేందుకు చాలా కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే తాజాప్రయత్నం ఒకటి ఓ కొత్త ప్రతిపాదనను తీసుకొచ్చింది.దాని ప్రకారం ఒకప్పుడు మంచు ముద్దగా ఉన్న భూమి  కరిగి నీరయ్యే దశలో వాతావరణం లోకి సముద్రాల్లోకి ఆక్షిజన్ను  విడుదల చేయడంతో జీవ జాతులన్నీ ఆక్షిజన్ ఆధారంగా మనగలగడం సాధ్యమయింది.
       భూమిపై ఆక్షిజన్ లేని సమయంలో ప్రాణులు సూర్య రశ్మి సాయంతో బ్రతికేవని ముందుగానే చెప్పుకు న్నాము.ఇది కూడా ఒక రకమైన కిరన జన్య సంయోగ క్రియనే.వాతా వరణంలోని సల్ఫర్ ఇనుములను ఉప యోగించుకుని ప్రాణులు శక్తిని ఉత్పత్తి చెసుకునేవి.అయితే 230 ఏండ్ల క్రితం భూమి మొత్తం మంచు ముద్దగా మారిపోయింది.ఎంతగానంటే భూ ఉపరితలం పై కొన్ని మైళ్ళ  మందం లో మంచు పేరుకు పోయేంత .ఈ దశలో ఓ కీలక మైన మార్పు చోటు చేసుకుంది.అతి నీల లోహిత కిరణాల కారణంగా మంచు పొరల్లో H2O2  ఉత్పత్తి అవుతుంది.సాధారణంగా నయితే సూర్య రశ్మి సోకినప్పుడు H2O2 నాశనం అవుతుంది.అప్పట్లో భారీ స్థాయిలో మంచు పొరలు ఉండటం వలన  లోపలి పొరల్లో కొద్దిపాటి H2O2  అలాగే  ఉండి పోయింది. మంచు గ్రహంగా పేరొందిన గురుగ్రహం పై కూడా H2O2 ఆనవాళ్ళు ఉన్నట్టు శాస్త్ర వేత్తలు గుర్తించారు.
    మంచుయుగం ముగిసినప్పుడు H2O2 వాతావరణంలోకి సముద్రాల్లోకి విడుదలయ్యింది .ఇది కూడా దశల వారిగా నెమ్మదిగా జరగడం వలన అప్పటికి ఆక్షిజన్ లేకుండానే బ్రతికేస్తున్న ప్రాణులకు హాని జరగలేదు.కాక పోతే ఈ రకమైన పరిస్థితికి అలవాటు పడేలా ఈ ప్రాణులు కొన్ని enzymes ను తయారు చేసుకోవడం వీలయ్యింది .పరినామ క్రమంలో జీవులు ఈ enzymes ఆధారంగా ఆక్షిజన్ ను ఉత్పత్తి చేయడం మొదలు పెట్టాయి .ఇలా భూమికి పచ్చదనం అబ్బింది అన్నమాట .
(ఈనాడు పత్రిక ఆధారంగా ,వారికి కృతజ్ఞతలు .)