శాస్త్రీయ దృక్పథం

విజ్ఞానశాస్త్ర అభిమానులకు "విజ్ఞానశాస్త్రము"బ్లాగు స్వాగతం ఈ బ్లాగు ప్రజలలో,విద్యార్థులలో ఉపాధ్యాయులలో శాస్త్రీయదృక్పథాన్ని పెంచుటకు ఉద్దేశించబడినది.

Saturday, 13 October 2012

జీవ వైవిధ్య విధ్వంస చిత్రం

  • ప్రపంచంలో క్షీరద జాతులు:5494
  • ఇప్పటికే అంతరించినవి:78
  • అంతర్దానం అంచున:191
  • కనుమరుగయ్యే జాబితాలో:447
  • సంఖ్య తగ్గిపోతున్నవి:496
  • గత 500 ఏళ్లలోమానవుల చర్యల వల్ల 969 జాతులు అంతరించాయి.నేడు క్షీరదాలలో 25% పక్షులలో 13% కోరల్స్ 33%ఉభయచరాలలో 41%, అంతర్థాన ముప్పును ఎదుర్కొంటున్నాయి క్షీరదాలు,పక్షులు ఎక్కువ గా ఇండోనేషియా,భారత్,బ్రెజిల్,చైనా వంటి దేశాలలోముప్పును ఎదుర్కొం టున్నాయి .
  • ప్రస్తుత జీవుల్లోదాదాపు సగం మేర,2100 సం : నాటికి అంతరించి పోవచ్చని అంచనా. వాతావరణ  ప్రతికూల పరిస్థితుల కారణంగానే 2100 నాటికి అన్నిరకాల జీవ జాతులు10-14 శాతం వరకూ తమ  ఉనికి  కోల్పోయే  ప్రమాదముందని  US NATIONAL ACADEMY  OF SCIENCE హెచ్చరించింది.
  • గత 100 ఏళ్లలో వ్యవసాయ పంటల్లోని  జీవ వైవిద్యం మూడొంతులు నాశన మైంది.ఇప్పుడు ప్రపంచం లోని సగానికి పైగా దేశాలకు కేవలం నాలుగు రకాల పంటలే  ఆహారిన్నిస్తున్నాయి.నెల సారవంతంగా  మారడాని కి  పట్టే  సమయం కంటే ఇప్పుడు వేగంగా సారాన్ని కోల్పోతుంది.ప్రపంచ వ్యాప్తంగా13 నుంచి18 రెట్లు  వేగం గా ఇది జరుగుతుంది.
  • భారత్,అమెరికా,ఇంగ్లాండ్,ఆస్ట్రేలియ,soth africa,brazil దేశాలలోపురుగు మందుల వాడకం వల్ల పర్యావర ణానికి వాటిల్లిన నష్టాన్ని ఓ  ఏడాదికి లెక్కిస్తే  అన్నింటాకలిపి వార్షిక నష్టం10,000 కోట్ల  డాలర్సర్స్ 
(ఈ సమాచారం ఈనాడు పత్రిక నుండి సేకరించింది.వారికి ధన్యవాదాలు.)

Tuesday, 9 October 2012

చెట్లు మన నేస్తాలు.

   మానవ జాతికి చెట్లు  ఎంత మేలు చేస్తున్నాయో తెలుసుకుంటే   చాలా ఆశ్చర్యం వేస్తుంది .చెట్ల వలన మనం పొందే లాభాలు తెలుసుకోండి మరి .

  •   రెండు పెద్ద చెట్లు రోజుకు నలుగురున్న కుటుంబానికి సరిపడా ప్రాణ వాయువు నిస్తాయి .
  • ఒక పెద్దచెట్టుకు రెండు నుండి నాలుగు  లక్షల ఆకులు ఉంటాయి.ఇవన్నీ కూడా వడబోసే filters లాగా పనిచేస్తాయి.అంటే  గాలిని శుభ్ర పరుస్తాయి.
  • ఒక ఎకరం విస్తీర్ణం లో దట్టంగా   ఉండే చెట్లు ఏటా  13 టన్నుల దుమ్ము,ధూళిలను  తొలగిస్తాయి.
  • చెట్లు లేని రోడ్ల దగ్గర లీటరు గాలిలో 10 నుండి 12 వేల ధూళి కణాలు ఉంటె చెట్లు ఉన్న రోడ్ల దగ్గర కేవలం 3  వేలే ఉంటాయి
  • చెట్టు సహజ మయిన aircondition లాగా పనిచేస్తుంది.ఒక చెట్టు తన ఆకుల ద్వారా రోజుకు  100  gallons నీటిని గాలి  లోకి తేమ రూపంలో వదులుతుంది.అందుకే  చెట్టు నీడ చాలా చల్లగా ఉంటుంది. 
  • ఒక చెట్టు ఇచ్చే చల్లదనాన్ని అయిదు రూం ఎయిర్ కండీషనర్స్ రోజుకు ఇరవై గంటల  వంతున  పని  చేస్తేనే గాని ఇవ్వలేవు.
  • ఒక ఎకరం విస్తీర్ణం లోని చెట్లు ఏడాదికి 2.6 టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ ను వాతావరణం నుండి తొలగిస్తాయి.
  • చెట్ల వేళ్ళు భూగర్భ జలాలనుండి  ప్రమాద కరమైన కాలుష్యాలను తొలగించి శుద్ధి చేస్తాయి.
  • ఒక football ground ఆవరణలో ఉండే చెట్లు (సుమారు 400 ) వాహనం ఏడాది పాటు వదిలే కాలుష్యాన్ని వాతావరణం నుండి తొలగించ గలవు.
  • 50 ఏళ్లలో ఒక చెట్టు 37,500 డాలర్ల (సుమారు 1,90,000) విలువైన ఆక్సిజన్ ను ఇస్తుంది. 

ఇంత మేలు చేసే చెట్లను మనం కాపాడుకోవాలి.ప్రభుత్వం చేసిన walta చట్టాన్ని పటిష్టంగా అమలు  చేయాలి.
( ఈ సమాచారం ఈనాడు   పత్రిక నుండి సేకరించినది.వారికి ధన్యవాదాలు) 

Friday, 5 October 2012

జీవ వైవిధ్యం దెబ్బతింటే ఏమి జరుగుతుంది? 1



          పంటల వైవిధ్యం దెబ్బ తిన్నది.జొన్న,సజ్జ,రాగి,కొర్ర అంతరిస్తున్నాయి.వీటిల్లో ఉన్న పోషకాలతో పశువులు బ్రతుకుతున్నాయి.వాటి విసర్జితాలు పొలానికి బలమైన ఎరువులు.ఒకప్పుడు రైతు 10,000 రకాల పంటలు పండిం చేవాడు.ప్రస్తుతం  200 లోపే పండింస్తున్నాడు.ఈ గింజలను పక్షులు,జంతువులు అన్నీ తింటాయి.కానీ ఇప్పుడు అన్నీ వాణిజ్య పంటలే!లక్షలు పోసినా పంటకు దిక్కు లేదు.బహుళజాతి విత్తనాలు,రసాయనాలు,క్రిమి సంహార కాలు మట్టిని విషంగా మారుస్తున్నాయి.వాన పాములు,ఎండ్ర కాయలు అంతరిస్తున్నాయి.
         దోమల గుడ్లు కప్పలు తినేవి.కప్పల్ని పాములు తినేవి.పాముల్ని గద్దలు వేటాడేవి.పిచ్చుకలు మిడతలదండు   ను తిని పంటను కాపాడేవి.ఈ చక్రం మనిషి స్వార్ధానికి చిన్నాభిన్నం అవుతుంది.పాములతోలు తో ఫ్యాషన్ వస్త్రాలు  తయారు చేస్తున్నారు.గద్దలకు ఆహారం కరవైంది.ప్రతి 20 నిముషాలకు ఒక జీవ జాతి అంతరించి పోతుంది.
      cell phone towers radiation వలన ఇప్పటికే పిచ్చుకలు అంతరిస్తున్నాయి.కొండలపైకూడా ఏర్పా టు చేయటం తో తేనెటీగలు కూడా నాశనం అవుతున్నాయి.ప్రకృతి కోసం సాంకేతికతను ఉపయోగించాలి పారిశ్రామిక వ్యర్తాల్ని తగ్గించి,కాలుష్యాన్ని నివారించి,చెత్తను సద్వినియోగం చేసుకుంటే ప్రకృతి స్వచ్చంగా మారుతుంది.జీవ వైవిధ్యానికి నష్టం  కలిగించకుండానే ఆర్ధిక ప్రగతి సాధించడానికి చాలా మార్గాలున్నాయి.
       సృష్టిలో మూడు కోట్ల వృక్ష జంతు జాతులున్నాయి.ఇప్పటికి గుర్తించింది15 లక్షలు మాత్రమే!అధిక జనాభాను నియంత్రించుకోవాలి.ఇదే వేగంతో జనాభా పెరిగితే అడవి జంతువులనే కాదు.తోటి మనుషుల్ని పీక్కు తినాల్సి వస్తుం ది.అడవుల్ని,జంతువుల్ని,నదుల్ని,సముద్రాలను,ధ్వంసం చేయటం వలన కాలుష్యం,కరువు కాటకాలు,మాయ రోగాలు,green house effect దాపురిస్తున్నాయి.

Monday, 1 October 2012

నేటి నుంచే అంతార్జాతీయ జీవ వైవిధ్య సదస్సు


          అంతార్జాతీయ జీవ వైవిధ్య సదస్సుహైదరాబాద్ లో ఈ రోజు ప్రారంభ మయింది.(Nature protects if she is protected) ప్రకృతిని కాపాడితే అది మనల్ని కాపాడుతుంది అన్నది  ఈ సదస్సు ముఖ్య ఉద్దే శ్యం. సదస్సు పేరు cop-11. 193 దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరవుతున్న ఈ సదస్సు హైదరాబాద్ లోని HICCలో october 1 నుండి 19   తేది వరకు జరుగుతుంది.ఈ సందర్భంగా ఈనాడు,సాక్షి, ఆంధ్ర జ్యోతి పత్రికల్లోని సమాచారంలో కొంత భాగాన్ని ఇక్కడ మీకు అందిస్తున్నాను.వారికి ధన్యవాదాలు.
          ఈ సృ ష్టి కొన్ని లక్షల జీవరాశులకు నివాసం.మొదట్లో సృష్టి ఎంతో వైవిధ్యంగా ఉండేది.20 లక్షల సం:క్రితమే మనిషి పుట్టాడు.ప్రకృతిని తన కంటే చాలా బలమైనదిగా అంగీకరిస్తూ దానిని దేవతగా పూజిం చాడు.మొదట్లో ప్రకృ తి గురించి తెలుసుకుంటూ జీవులతో స్నేహం చేస్తూ ఉన్నాడు.జంతువుల మాంసం తినటం ప్రారంబించిన తరు వాత,పంటలు పండించుకునే తెలివివచ్చిన తరువాత అతనికి ధైర్యం వచ్చి ప్రకృ తి నాకోసం పుట్టిందని భావిస్తూ దానిని ఉపయోగించుకుంటూ దోచుకుంటూ,నాశనం చేస్తూ వస్తున్నాడు తాను ఈ సృష్టిలో ప్రత్యేక మని భావిస్తు న్నాడు.కానీ ప్రకృతి దృష్టిలో అందరు సమానమే!.
         వైవిధ్యమే ప్రకృతి లోని రహస్యం.మనుషుల వలన ఎన్నో జీవ జాతులు అంతరించి పోతున్నాయి ఆదిమ దశలో వన్య మృగాల్ని చంపి ఆకలి తీర్చుకున్నాడు.మనిషి నాగరికత నేర్చుకున్న కొద్ది అడవుల్ని నరికేసి గ్రామా ల్ని కట్టుకున్నాడు. జంతువుల తోలు తీసి అమ్ముకోవడానికి బొమ్మల్లాగా అలంకరించుకో వడానికి ఎన్నో అమా యక జీవుల్ని పొట్టన పెట్టుకున్నాడు.ప్రకృతిలో వచ్చేమార్పుల కనుగుణంగా జీవు లు అంతరించి పోవచ్చుకానీ మనిషి స్వార్థం మూలంగా అంతరించి పోకూడదు.గనుల త్రవ్వకాలు,రవాణా మార్గాలు,పారిశ్రామికీకరణ జంతు వులకు అవరోధంగా మారాయి.
         10 సం :క్రితం 10,000 పులులుండేవట ప్రస్తుతం 1500 లోపే ఉన్నాయి.ఎలుగుబంట్లు,ఏనుగులు ఊర్ల మీద దాడి చేస్తున్నాయంటే ఈ అసమ తౌల్యం వల్లనే.వన్యప్రాణులకు అడవి ఒక స్వర్గం.పులులుంటే చెట్లను వేటగాళ్ళు ఏమీ  చేయలేరు .చెట్లు ఎక్కువుంటే వేటగాళ్ళు ఏమీ చేయలేరని అడవి జంతువుల విశ్వాసం.చెట్లు,మృగాలను మని షి ధ్వంసం చేస్తున్నాడు.వాటిని ప్రేమించే గిరిజనులను తరిమి కొడుతు న్నాడు.భూమి వేడెక్కుతుంది అన్నా వరద లు ముంచెత్తినా,భూసారం క్షీనించినా కారణం అడవులు నాశనం కావటం వల్లనే .
        నదులను,సముద్రాలను మనిషి కలుషితం చేస్తున్నాడు.సముద్ర జీవులను వేటాడి ఎగుమతులు చేసి కోట్లు గడిస్తున్నాడు.నక్షత్ర తాబెల్లను,నీటి గుర్రాలను నాశనం చేస్తున్నాడు.అన్ని పారిశ్రామిక వ్యర్థాలను నీటిపాలు చేసి మత్యసంపదను ,అందులోని జీవుల  వినాశనానికి కారణమవుతున్నాడు.  

Saturday, 15 September 2012

ప్రముఖ అణుశాస్త్రవేత్త కొడవటిగంటి రోహిణీ ప్రసాద్ కు శ్రద్దాంజలి

               ప్రముఖ అణుశాస్త్రవేత్త  కొడవటిగంటి రోహిణీ ప్రసాద్ గత శనివారం (8/9/2012) ముంబైలోమదుమేహం ,కిడ్నీ,కాలేయ సమస్యలతో బాధ పడుతూ కన్ను మూశారు.ఆయన ప్రముఖ రచయిత కొడవటిగంటి కుటుంబ రావు కుమారుడు.ఆయనకు భార్య(లలిత) ,కుమారుడు,కుమార్తె ఉన్నారు.ఈ యన 1949 september 14 న మద్రా స్ లో జన్మించారు.వృత్తి పరంగా అణుధార్మిక శాస్త్రవేత్త .మంచి సితార్ విద్వాంసుడిగా,రంగస్థల నటుడిగా,రచయిత గా పేరు గడించాడు మద్రాస్ university లో physics లో డిగ్రీ ,ఆంధ్ర university లో M.sc,Mumbai లో  phd చేసి బాబా అణు పరిశోధనా కేంద్రం లో పని చేసారు.మూడు దశాబ్దాలుగా అణు ధార్మిక పరిశీలనా పరికరాల రూప కల్పన లో పాల్గొంటున్నారు.అమెరికా లోని అట్లాంటా లో consultant గా ఉన్నారు.చాలా కాలంగా అనేక తెలుగు పత్రికలలో సంగీతం మీదా ,శాస్త్ర విజ్ఞానం మీదా రచనలు చేస్తున్నారు.
           ఈ 21 వ శతాబ్దంలోకూడా ప్రకృతి పట్లే,సమాజం పట్ల,మనిషి పట్ల ఉండవలసిన హే తుబద్ద ,భౌతికవాద ,శా స్త్రీయ ఆలోచనలు చాలా మందిలో ఉండడం లేదు.ఇటువంటి స్థితిలో తెలుగులో అందరికి అర్థమయే రీతిలో సూటిగా సరళంగా వీరి రచనలు సాగాయి.అణువుల శక్తి,ప్రకృతి పర్యావరణం,మనుషులు చేసిన దేవుళ్ళు ,విశ్వాంతరాళం జీవ కణాలు నాడీకణాలు,మానవ పరిణామం, జీవశాస్త్ర విజ్ఞానం -సమాజం లాంటి పుస్తకాలు విశేష ప్రాచుర్యాన్ని పొందాయి.
     ఈయన బ్లాగు కూడా వ్రాసేవారు.దీనిని నేను ఇంతకు ముందు చదివాను.ఆయన పుస్తకాలు మానవ పరిణామం విశ్వాంతరాళం  సమాచారం నాకు radio లో science సంభాషణలు చెప్పటంలో  చాలా ఉపయోగ పడింది.వారికి సర్వదా రుణపడి ఉంటాను.ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియ జేస్తున్నాను.
ఈయన బ్లాగు 
http://rohiniprasadkscience.blogspot.in/

Sunday, 26 August 2012

రోదసియానం(ఆడియో)

          విజ్ఞాన శాస్త్రంలోని పలు అంశాలపై మార్కాపురం radio station వారు నా తో జరిపిన సంభాషణలలో మొదటిది  అయిన "రోదసియానం"  ఈ లింక్ లో వినగలరు.ఈ కార్యక్రమాన్ని నాతో జరిపిన  శ్రీ మహేష్ గారికి ధన్యవాదాలు. మొత్తం 12 episodes గా ప్రసారం అయిన వీటిని ఇచ్చి నన్ను ప్రోత్సాహించిన శ్రీ మహేష్ గారికి సాంకేతిక  సిబ్బంది అయిన శ్రీ నరసింహారావు గారు,తదితరులకు నా కృతజ్ఞతలు.వీటిని తరువాత  ఈ బ్లాగులో పోస్ట్ చేస్తాను.      
http://www.4shared.com/music/Xyi7EIzn/1RODASIYANAM-EDITED.html

Sunday, 19 August 2012

అంగారక గ్రహం(mars) విశేషాలు


       ఈ మధ్య curiocity అంగారకుని పైకి వెళ్ళిన తరువాత అందరి దృష్టి అంగారకుని వైపు మళ్ళింది.ఇది ఆకాశంలో ఎర్రగా కనబడుతుంది.ఇనుము oxide రూపంలో ఉండటం వలన అలా కనపడుతుంది.భూమి తరువాత కుజ గ్రహం పై జీవం ఉండవచ్చునని శాస్త్రజ్ఞులనమ్మకం.1964 లో merinar -4,అనే రోదసీ నౌక కుజుడి ప్రక్కనుండి ప్రయాణించిం ది.1976  లో అమెరికా ప్రయోగించిన vyking  నౌకలు తొలిగా కుజుడి మీదకు దిగి ఆరేళ్ళపాటు వర్ణ చిత్రాలను  ప్రసా రం చెయ్యగలిగాయి.1988, లో రష్యా కుజుడి ఉపగ్రహాలైన ఫోబోస్,daimose ల కోసం ప్రయోగించ బడ్డాయి. hubble telescope  సహాయంతో కుజుడిని ఫొటోలు తీస్తున్నారు.దీని యొక్క సరాసరి వ్యాసం 6780km భూమితో  పోలిస్తే సగం,చంద్రునితో పోలిస్తే రెట్టింపు ఉంటుంది.భూమిలో 10 వ వంతు ద్రవ్య రాశిని కలిగి ఉంటుంది.భూమితో పోలిస్తే 38%  గురుత్వాకర్షణ   శక్తి కలిగి ఉంటుంది.నీటికన్నా 3.9 రెట్లు ఎక్కువ సాంద్రత కలిగి ఉంటుంది.భూమి సాంద్రత నీటి కన్నా 5.5 రెట్లు ఎక్కువ.
       అయ స్కాంత క్షేత్రం గ్రహమంతా విస్తరించి లేదు.ఇది సూర్యుడి నుండి దూరంలో నాలుగవది.భూమి తర్వాత ఉంటుంది .సూర్యుడి నుంచి 23 కోట్ల కి.మీ సూర్యుడి చుట్టూ తిరిగి రావటానికి 320  రోజులు  పడుతుంది వాతావ రణం లో 95%,co2 3% nitrogen,1.6% organ ఉంటాయి.దీని ఆత్మ భ్రమణ కాలం24 గంటల  39 నిమిషాల  35 సెకండ్స్ .సౌర వ్యవస్థలో అన్నింటికన్నా ఎత్తయిన శిఖరం కుజుడి మీద ఉంది.olympus mones ఒక చల్లారిన అగ్ని పర్వతం.ఇది evarest కు మూడింతలు ఉంటుంది.ద్రువాలు 25 డిగ్రీలు   ఒరి గి ఉండటం వలన రుతువులు ఏర్పడ తాయి.ఉపరితల వాతావరణ పీడనం భూమితో పోలిస్తే 1/100 వ వంతు ఉంటుంది.ఉపరితల గాలులు గంటకు 0-20 మైళ్ళ వేగంతో వీస్తుంటాయి.ధూళి తుఫాన్స్ వస్తుం టాయి.ఉపరితలం పై సరాసరి ఉష్ణోగ్రత -55 డిగ్రీల  సెల్సియస్  ధ్రువ  ప్రాంతాల్లో  రాత్రి  పూట  -128 డిగ్రీల  celsius  ఉష్ణోగ్రత ఉంటుంది.పగటి సమయంలో అంగారక మధ్య ప్రాంతం లో 27 డిగ్రీలు ఉంటుంది.
      కుజుడి పై ఉల్కలు డీ కొట్టిన క్రేటర్ సాక్ష్యాలు ఎక్కువే.లోయలు పెద్దవే నాలుగు వేల కి.మీ లోతు ఉన్నవి ఉన్నా యి.భూమి మీద కదిలినట్లుగా ఫలకాలు ,plate tectanics ప్రక్రియల ద్వారా కదలడం వంటిది కుజుడి మీద కనబడ దు.అగ్నిపర్వతాలు ప్రవహించిన గురుతులున్నాయి.ఉల్కా పాతాల గోతులు కనిపిస్తాయి.కుజుడి పై సగటు ఉష్ణోగ్రత -55  డిగ్రీలు.ఉష్ణోగ్రత  -133 నుండి  27 డిగ్రీలు  వుంటుంది .భూమి తరువాత జలరాశి,జీవ కణాల ఉనికికి కుజుడి మీద అవకాశం ఉందని భావిస్తున్నారు.ధ్రువాల్లో మంచు గడ్డ కట్టి కనిపిస్తుంది.గతంలో నీరు వరదగా పారిన దాఖలా లు నదీశయ్యా ప్రాంతాలు కనిపిస్తున్నా యి.నీరుంటే తప్ప రూపొందలేని hematite వంటి ఖనిజాల జాడ తెలిసింది కుజుడి పైనుండి భూమి పైకి పడ్డ ఉల్కలో సేంద్రియ పదార్థాలు ఉండటం ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి మార్స్ పైకి pathfinder, spirit, sojourner వంటి కొన్ని ప్రయోగాలు జరిగాయి.ఇవి కుజుడి పై దిగి ఫొటోస్ తీసాయి.కుజుడి పైకి మనుషు లు వెళ్ళే ప్రయోగాలు అమెరికా ప్రారంభించింది.కాని దానికి మరో పాతిక సంవత్సరాలు పట్టవచ్చు.ప్రస్తుతం జరిగిన ఈ curiocity ప్రయోగం దానికి బాటలు వేస్తుందని ఆశిస్తున్నారు.

Wednesday, 8 August 2012

అంగారకుని పై జీవాన్వేషణ


                 అంతరిక్ష పరిశోధనల్లో  అత్యంత అధునాతనమైన వ్యోమ నౌక /రోవర్ curiocity  సోమవారం       ఉదయం11 గంటలకు అంగారకుని పై దిగింది.NASA లోని జెట్ ప్రొపల్షన్ laboratory లో శాస్త్ర వేత్తలు ఒకరినొకరు హత్తుకొని ఆనందంతో పొంగిపోయారు.గతంలో ఎప్పుడైనా జీవం ఉనికిలో ఉందా!భవిష్యత్తు లో జీవం ఉనికి లో ఉండటానికి అవసరమైన పరిస్థితులు అక్కడున్నాయా!వంటి ప్రశ్నలకు ఇది సమా ధానం కనుగొనబోతుంది.దిగిన కొద్ది సేపటికే చిన్న సైజు ఫోటోను ,మరొక భారీ సైజు ఉన్నమరో  ఫోటోను  పంపించి అక్కడి మట్టిని,రాళ్ళను భూమి పైకి తీసుకు వచ్చి వాటిని పరీక్షించి project లకు  వ్యోమగా ముల్ని అక్కడికి పంపించాలన్నఆలోచనకు మార్గం వేయనుంది.జీవం ఉనికికి అత్యవసరమైన  corbon,nitrogen,phospurus,sulphur,oxygen వంటి మూలకాలను ఇది అన్వేషిస్తుంది.
           ఈ వ్యోమ నౌక plutonium వేడి నుంచి పుట్టే విద్యుత్తు ద్వారా పనిచేస్తుంది.ఇందులో భారత శాస్త్ర వేత్తలు అశ్విన్,అమితాబ్ ఘోష్,అనితాసేన్ గుప్త,రవి ప్రకాష్ పాల్గొన్నారు.ఇందులో అశ్విన్ ఈ యాత్రకు deputy project scientist గా ఎదిగారు.రానున్న రోజుల్లో ఆయన నేతృత్వం లోని శాస్త్రవేత్తల బృందం దాదాపు 400 మంది అంగారకుడిపై లోగడ ఎప్పుడైనా జీవం ఉనికికి అనువైన  పరిస్థితులు ఉన్నాయా,  లేవా అని తేలుస్తుంది.ఇప్పటి వరకు అంగారకుని పైకి మేరైనర్ 4,6,7,9 vyking1,2 mars global surveyor,odissee ,mars express,mars pathfinder,mro,spirit,opportunity,feeniks వంటి అనేక రోబోటిక్ యాత్రలు జరిగాయి.

Saturday, 4 August 2012

అంగారక గ్రహం పైకి curiocity


           ఈ విశ్వంలో భూమి మీద తప్ప మరెక్కడా జీవం ఉన్న ఆధారాలు మనకు దొరకలేదు.మన సౌర కుటుం బంలోజీవం మనుగడ సాగించడానికి కొంత మేరకు అనువైనది అంగారక గ్రహమని భావిస్తున్నారు ఒకప్పుడు ఇక్కడ నీరు ఉండేదని ,జీవుల మనుగడకు అనుకూల పరిస్థితులు ఉండేవని అనుకుంటున్నారు.USA వారిNASA   26/11/2011  తేదీన  ఫ్లోరిడా లోని cape canavaral వైమానిక స్థావరం నుండి అంగారక గ్రహం పైకి "curiocity"అనే rovar ను ప్రయోగించింది.ఇది 5.6 కోట్ల కిలోమీటర్స్ దూరం ప్రయాణించి సోమవారం అంగారక గ్రహం పైకి దిగనుంది. .నీటి ఆనవాళ్ళున్నగేల్ బిలం లోకి దీన్ని దించుతున్నారు.ఇది ఒక సంచార ప్రయోగశాల.శిలలను చూసి,నేలను త్రవ్వి జీవం ఆనవాళ్ళను పసిగడుతుంది.దీనిలో నీటిని గుర్తించే పరికరాలు,ఆధునిక కెమెరాలు ఉన్నాయి.ఇది 900 కిలోగ్రాముల బరువు కలిగి ఉంది.దీన్ని నిర్మించటానికి 250 కోట్ల dollars ఖర్చు అయ్యాయి .గంటకు 13 వేల మైళ్ళ వేగంతో అంగారకుడి వాతావరణంలోకి దూసుకు వచ్చి ఏడు నిమిషాల వ్యవధిలో దానిపై దిగాలి.రాకెట్ సాయంతో పనిచేసే skycrane ద్వారా ఈ రోవర్ ను క్రిందికి దించుతారు.

Saturday, 16 June 2012

ప్రక్రుతి సూత్రాలు:చివరి మాట


                 పదార్ధమంతా  మిధ్య అనేవాళ్ళు ,జీవ పరిణామాన్ని వ్యతిరేకించే వాళ్ళు 18  వ నియమాన్ని చూసైనా కళ్ళు తెరవాలి.మానవుడు,ప్రక్రుతి పరిశీలన  ద్వారా ,శ్రమ ద్వారా ఆధునిక మానవ సమాజానికి బీజం వేసాడు.పైన పేర్కొన్న సూత్రాల పరిధిలో సాగుతున్న నేటి శాస్త్ర సాంకేతిక రంగాలు ఎంతగానో అభి వృద్ది చెందాయి.అయితే ఈ విజ్ఞాన శాస్త్ర ఫలితాలను కొందరు మాత్రమే అనుభవిస్తున్నారు.సామాన్య ప్రజా నీకానికి ఈ ఫలితాలు నేటికీ అందుబాటులో లేవు.అత్యంత ధనిక వర్గం ప్రపంచ వనరులలో 85% మేరకు వినియోగిస్తున్నారు.కాగా అత్యంత పేద వర్గాలకు కేవలం ప్రపంచ వనరులలో 1% మాత్రమే  అందుబాటు లోఉంది .సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యల పరిష్కారానికి ఈ శాస్త్ర సాంకేతిక రంగాల పరి జ్ఞానాన్ని ఉపయోగించాలి.ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని  శాస్త్ర సాంకేతిక రంగాల పరిశోధనలు సాగాలి.
        ఆధునికతను సంతరించుకున్న శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధిలో పరోక్షంగాను,ప్రత్యక్షం గాను అందరి సమిష్టి కృషి వున్నా ప్రజా బాహుళ్యం అనేక అశాస్త్రీయ  పోకడలతోనూ,మూఢాచారాలతోను   చాందసత్వం తోను కొట్టుమిట్టాడుతోంది.ప్రాంతీయ ,కుల ,మత,వర్ణ,భాషా తదితర అనేకానేక అశాస్త్రీయ  ప్రాతిపదికల ఆధారంగా ప్రజలలో వైషమ్యాలను రెచ్చగొడుతున్నారు.యుద్ధ వాతావరణం ,అరాచకత్వం ఉగ్రవాదం,మతోన్మాదం,మానవ సమాజాన్ని పట్టి పీడిస్తున్నాయి.ఇది అశాష్ట్రీయం.సైన్సు సూత్రాలకు విరుద్ధం.ప్రజలందరిలో సౌభ్రాతృత్వం,సాంస్కృతిక వికాసము,వివేకం కలిగించడం ద్వారా  ఐకమత్యాన్ని పెంపొందించాలి.తద్వారా ప్రపంచ శాంతిని శాశ్వతం చేయాలి.ఈ లక్ష్య సాధనకు ప్రజా సైన్సు ఉద్యమాల ఆవశ్యకత ఎంతో ఉంది.ఈ ఉద్యమాల తీవ్రతను బట్టే ప్రజలకు శాస్త్ర సాంకేతిక రంగ ఫలితాలు దక్కుతాయి .ప్రజా సైన్సు ఉద్యమం పట్ల సరియైన అవగాహన కలిగిన నాయకత్వం ఉన్నప్పుడు మాత్రమే ఇది సాధ్య మవుతుంది.
            "ప్రకృతి సూత్రాలు-శాస్త్రీయ దృక్పధం" అనే అంశాన్ని అధ్యనం చేయడం ప్రజా సైన్సు ఉద్యమ నిర్మాణం లో ఒక అత్యవసర భాగం.సమసమాజ స్థాపనకు కృషి చేసే శక్తుల పట్ల సానుభూతి ప్రకటిస్తూ స్వతంత్రంగా ప్రజా బాహుళ్యంలో ప్రజలకోసం సైన్సు,ప్రగతి కోసం సైన్సు ,ప్రపంచ శాంతి కోసం సైన్సు ,అనే నినాదాలతో కృషి చేస్తున్న అల్ ఇండియా పీపుల్స్ సైన్సు నెట్ వర్క్ (APSN) అనుబంధ సంస్థ జనవిజ్ఞాన వేదిక ఉద్యమాల్లో భాగమై భారత రాజ్యాంగం సూచించిన శాశ్త్రీయ దృక్పద వ్యాప్తిలో అందరం ఉద్యమిం చవలసిన తరుణమిదే!