శాస్త్రీయ దృక్పథం

విజ్ఞానశాస్త్ర అభిమానులకు "విజ్ఞానశాస్త్రము"బ్లాగు స్వాగతం ఈ బ్లాగు ప్రజలలో,విద్యార్థులలో ఉపాధ్యాయులలో శాస్త్రీయదృక్పథాన్ని పెంచుటకు ఉద్దేశించబడినది.

Thursday 9 February 2012

ప్రకృతి సూత్రాలు

ప్రకృతి సూత్రాలు అనే పుస్తకం ప్రొఫెసర్ A.రామచంద్రయ్య గారు రచించారు .ఈ పుస్తకం లో ప్రకృతి ఎలా నడుస్తుంది అన్న విషయాన్ని చక్కగా వివరించారు .ఈ ప్రకృతి క్రింద చెప్పిన 18 సూత్రాల ఆధారం గా నడుస్తున్నదని శాస్త్ర వేత్తలంతా కలిసి తీర్మానించారు.
1)సహజ సంఘటనలు పరిశీలకుని ఇష్టానుసారంగా జరగవు.
2)మనం చూస్తున్న నేటి విశ్వం మహా విస్పోటనం అనబడే ఒక సంఘటనలో ఏర్పడింది.
3).ఈ విశ్వంలో ఏదీ స్థిరంగా లేదు.ప్రతిదీ చలనం లో వుంది. ఎ   వస్తువు శాశ్వతం కాదు.మార్పు మాత్రమే శాశ్వతం
4) విశ్వం లో కేవలం నాలుగు రకాల బలాలు మాత్రమే వున్నై.అవి
a)గురుత్వాకర్షణ బలాలు,
b)విద్యుత్ అయస్కాంత బలాలు 
c)బలమైన  కేంద్రక  బలాలు 
d)బలహీనమైన కేంద్రక బలాలు.
5)విశ్వం క్రమబద్ధంగా వుంది కాబట్టి దాని గురించి సంపూర్ణంగా అధ్యయనం చేయవచ్చును.
6)కేంద్రక శక్తే అన్ని రకాల శక్తులకు మూలం . కేంద్రక శక్తి పదార్థ వినిమయం తో విడుదల అవుతుంది.పదార్థ రూపాంతరమే శక్థి.
7)ఒకే  సూత్రాల సముహంతో చలనాలనన్నింటిని వివరించగలము.  
8)భౌతిక రాశులన్ని   గులకలుగా ఉంటాయి.ఏ భౌతిక రాశి ని అవిచ్చిన్నంగా సూ క్ష్మీకరించ లేము
9)విశ్వం లో అన్ని సంఘటనలలోను ద్రవ్య శక్తి నిత్యత్వమే .పదార్ధము, శక్తిని నూతనముగా  సృష్టించలేము ,నాశనం చేయలేము.
10)శక్తి రూపాలన్నీ  ఉష్ణ రూపం లోకి మారుతున్నాయి.
11)పదార్ధాలన్నీ పరమాణు నిర్మితాలు.
12)పదార్ధాలలో పరమాణువులు సంధానించుకున్న పద్ధతినిబట్టి ఆయా పదార్థాలు తమ ధర్మాలను ప్రదర్శిస్తాయి 
13)పరమాణువులు ఎలక్ట్రాను చలనాలతోనే సంధానించుకుని వుంటాయి 
14)పదార్థం అంతిమంగా క్వార్కులమయం.
15)భూమ్మీద జీవం నిర్జీవ పదార్తాలనుండే  పుట్టింది. జీవం పరిణామం చెందుతూ పలురుపాల్లోకి ప్రకృతికి అనుగుణంగా విస్తరిస్తోంది.మానవుడు జీవ పరిణామం ద్వారానే సంభావించాడు.
16)జీవం కేవలం కణాల్లో మాత్రమే ఉండగలదు.
17)జీవులు వేరయినా అన్ని జీవులలోను ఒకే విధమయిన జన్యుస్మ్రుతి ఉంది
18)జీవులన్నింటి మధ్య పాదార్తిక బంధం ఉంది.

No comments:

Post a Comment