శాస్త్రీయ దృక్పథం

విజ్ఞానశాస్త్ర అభిమానులకు "విజ్ఞానశాస్త్రము"బ్లాగు స్వాగతం ఈ బ్లాగు ప్రజలలో,విద్యార్థులలో ఉపాధ్యాయులలో శాస్త్రీయదృక్పథాన్ని పెంచుటకు ఉద్దేశించబడినది.

Sunday 28 August 2022

మన అమ్మమ్మ ఇల్లు అక్కడే

 మన అమ్మమ్మ ఇల్లు అక్కడే.....




మీ అమ్మమ్మ పేరు ఏంటి? మరి వాళ్ళ అమ్మమ్మ పేరు? ఉహూ తెలీదు కదూ!మన మైటో కాండ్రియా ఈవ్ (అంటే మనందరి అమ్మమ్మమ్మ.......) పుట్టిన ఊరు ఆఫ్రికా ఖండం లో   ఉందట.ఈ విషయం మైటో కాండ్రియా DNA ద్వారా Scientist లు నిరూపించారు. ఇంతకు ముందు post మొత్తం చదవండి, మానవులంతా బంధువులే ననే వాస్తవం తెలుస్తుంది.విద్యార్థుల్ని నేను ఎప్పుడు మీ నాన్న పేరు ఏమిటి, వాళ్ళ నాన్న పేరు ఏమిటి? అంటూ వెనక్కి అడుగుతూ ఉంటాను. 3,4 తరాలు చెప్పగలరు ఎవరయినా!మా నాన్న గోవిందరెడ్డి 13 తరాల మా వంశ వృక్షం నా కందించి వెళ్లారు.అలాగే ప్రస్తుతం జనాభా ఎంత? అలా 100,200, 1000,10,000 ఏండ్ల క్రిందట జనాభా ఎంత ఉండొచ్చు అని అడుగుతుంటా!అలా 2,00,000 ( రెండు లక్షల) సం.క్రితంకొద్ది మంది హోమో సే పియన్స్ సమూహమే ప్రస్తుత మానవజాతి అంతా.DNA ఆధారంగా మానవులంతా బంధువులే అని నిరూపించింది సైన్స్. ఈ ఆధారం మరో తిరుగులేని సాక్ష్యం. ప్రతి ఒక్కరిలో ఈ భావం పాఠశాల స్థాయి నుంచే నేర్పితే ప్రపంచం ఇలా ఉండదు.... ఒద్దుల రవిశేఖర్.


Tuesday 5 July 2022

అడవులు.. భూమికి ఊపిరి తిత్తులు

 

అడవులు భూమికి ఆక్సిజన్ అందించే జీవనా డులు. అటువంటి వాటిని యదేచ్చగా నరికి వేస్తూ మానవుడు తన భవిష్యత్తును తానే బలి పెట్టుకుంటున్నాడు. అడవులు నశిస్తే భూమి ఉష్ణోగ్రత పెరిగి మంచు ఖండాలు కరిగి సముద్ర తీరప్రాంతాలు నీట మునగడం వల్ల కొన్ని కోట్లమంది నిరాశ్రయులవుతారు. వాతావరణ అసమతౌల్యం వల్ల అతి వృష్టి అనా వృష్టి వరదలు, కరువు వంటి విపరీత పరిణామాలు చోటు చేసుకుంటాయి.ప్రపంచ వ్యాప్తంగా 31% అడవులు ఉన్నాయి. కానీ 33% ఉంటే సమతౌల్య స్థితి ఉన్నట్లు.ప్రపంచం మొత్తం అడవుల్లో 20% రష్యా లో,10% కెనడా లో ఉన్నాయి.భూటాన్ భూభాగం లో 71% అడవులే. ఇంకా అత్యధికంగా అడవులు ఉన్న దేశాలు అమెరికా కెనడా చైనా. మనదేశం లో 24.39% మాత్రమే ఉన్నాయి అడవులను పరిరక్షిస్తూ వాటిని సమృద్ధిగా పెంచవలసిన ఆవశ్యకత ఎంతో ఉంది..(https://reliefweb.int/report/world/state-world-s-forests-2020-forests-biodiversity-and-people-enarru)

Thursday 23 June 2022

విజ్ఞాన శాస్త్రాలు అవకాశాలు

 రచయితలు : A.P.J అబ్దుల్ కలాం, సృజన్ పాల్ సింగ్ అనువాదం :త్రిమూర్తి                           పుస్తక పరిచయం:ఒద్దుల రవిశేఖర్                                       ఇతరుల జీవితాల్లో ఎటువంటి మార్పు తేగలం అన్న మనస్తత్వం కలిగి ఉంటారు శాస్త్రవేత్తలు.ఈ పుస్తకం 7 విభిన్న విజ్ఞాన  శాస్త్రాల శాఖల గురించి అందులో ఉన్న అవకాశాల గురించి తెలియ జేస్తుంది.1) రోబో విజ్ఞాన  శాస్త్రo:భవిష్యత్ రోబో శాస్త్రం ప్రగతిని గురించి,మానవాకార రోబో అసిమో, జీవ ప్రేరిత రోబోల గురించి వివరిస్తారు.2) వైమానిక శాస్త్రo :విల్బర్ రైట్, ఆర్విల్ రైట్ సోదరులు విమానాన్ని కనుగొన్నారు (1903). Bernouli  సూత్రాన్ని ఇందులో ఉపయోగిస్తారు.శబ్ద వేగం (1200km/hr)కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించే హైపర్ సోనిక్ విమానాలు,సూపర్ సోనిక్ విమానాలు(6000km/hr) వంటి ఆధునిక సాంకేతికత అభివృద్ధి చెంది మంచి ఉపాధి అవకాశాలు ఉంటాయని ఇందులో తెలిపారు. 3) వ్యాధి నిర్ణయ శాస్త్రవేత్త:

మొదటగా లూయీ పాశ్చర్ సూక్ష్మ జీవుల గురించి అధ్యయనం చేశారు. సైనో బాక్టీరియా అనే సూక్ష్మజీవుల వలన 2.3 బిలియన్ సం. క్రితం భూమిపై ఆక్సిజన్ ఉత్పత్తి అయింది. బాక్టీరియా వైరస్ ల గురించి చక్కని వివరణ ఇచ్చారు. కాన్సర్, HIV వ్యాధులు కలిగించే కారకాల గురించి టీకా ల గురించి వివరించారు. రచయిత సృజన్ పాల్ సింగ్ జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ రూపకర్త.4) అంతరిక్ష శాస్త్రవేత్త:విశ్వం గురించి పరిశోధించిన శాస్త్రవేత్త ల ను పరిచయం చేస్తారు.విశ్వ పరిణామాన్ని అంచనా వేయడంలో జరిగిన ప్రయత్నాలను కూలంకషంగా వివరిస్తారు.అబ్దుల్ కలాం గారు ఇందులో తన విశేషమైన అనుభవాన్ని పంచుకుంటారు.       5) నాడీ శాస్త్రవేత్త:మనిషి మెదడు గురించి విశేష మైన, అద్భుతమైన పరిశోధనలు జరుగుతున్నాయి.మెదడు, యంత్రం సంధానం అప్పుడే ప్రారంభమయ్యింది. ఇందులోని అవకాశాలు నాడీ శాస్త్ర నిపుణుడు డా. జోగి వివరిస్తారు.6)పదార్ధ విజ్ఞాన శాస్త్రవేత్త:విమానాలు మెరుపుల తాకిడి కి గురికాకుండా అల్యూమినియం లోహ మిశ్రమాలు వాడుతారు. మానవ పరిణామ క్రమం లో రాగి, వెండి, ఇనుము లోహాలను ఉపయోగించి పరికరాలను తయారు చేసుకున్నాడు. తరువాత నేడు అనేక మిశ్రమ లోహాలను తయారు చేస్తున్నాడు.ఇందులో ఉన్న అవకాశాలను కలాం గారు వివరిస్తారు.   7)పురాజీవ శాస్త్రవేత్త:వీరు వేల, లక్షల సం. క్రితం భూమి మీద జీవ స్వరూపాలు ఎలా ఉండేవో శిలాజాలను అధ్యయనం చేసి తెలుసుకుంటారు. భూమి ఏర్పడ్డ 455 కోట్ల సం. నుండి భూమి మీద జరిగిన మార్పులను చక్కగా తెలిపారిందులో. ఈ రంగం లో నిపుణుడైన Dr. అశోక్ సాహని మంచి సూచనలు అందించారు.ఇలా విభిన్న మైన కోర్సులు ఉండగా డాక్టర్, software ఈ రెండు రంగాలనే మన విద్యార్థులు ఎంచుకోవడంతో అక్కడా సరయిన ఉపాధి అవకాశాలు కరువైతున్నాయి. ఉపాధ్యాయులు గా మనం ఈ పుస్తకం లోని కోర్సుల గురించి విద్యార్థులకు తెలియజేయాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది.