శాస్త్రీయ దృక్పథం

విజ్ఞానశాస్త్ర అభిమానులకు "విజ్ఞానశాస్త్రము"బ్లాగు స్వాగతం ఈ బ్లాగు ప్రజలలో,విద్యార్థులలో ఉపాధ్యాయులలో శాస్త్రీయదృక్పథాన్ని పెంచుటకు ఉద్దేశించబడినది.

Friday 25 September 2015

ప్రాణ వాయువు పుట్టింది ఇలా !


                  భూమిపై ఒకప్పుడు ఆక్షిజన్ లేదు! ఉన్న కొన్ని ప్రాణులు సూర్య రశ్మి సాయం తో మనగలిగేవి. భూ   వాతావరణం ....ఈ దశ నుండి ఆక్షిజన్ ఆధారిత దశకు చేరిందేలా ?
           ఈ చిక్కుముడిని  విప్పేందుకు చాలా కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే తాజాప్రయత్నం ఒకటి ఓ కొత్త ప్రతిపాదనను తీసుకొచ్చింది.దాని ప్రకారం ఒకప్పుడు మంచు ముద్దగా ఉన్న భూమి  కరిగి నీరయ్యే దశలో వాతావరణం లోకి సముద్రాల్లోకి ఆక్షిజన్ను  విడుదల చేయడంతో జీవ జాతులన్నీ ఆక్షిజన్ ఆధారంగా మనగలగడం సాధ్యమయింది.
       భూమిపై ఆక్షిజన్ లేని సమయంలో ప్రాణులు సూర్య రశ్మి సాయంతో బ్రతికేవని ముందుగానే చెప్పుకు న్నాము.ఇది కూడా ఒక రకమైన కిరన జన్య సంయోగ క్రియనే.వాతా వరణంలోని సల్ఫర్ ఇనుములను ఉప యోగించుకుని ప్రాణులు శక్తిని ఉత్పత్తి చెసుకునేవి.అయితే 230 ఏండ్ల క్రితం భూమి మొత్తం మంచు ముద్దగా మారిపోయింది.ఎంతగానంటే భూ ఉపరితలం పై కొన్ని మైళ్ళ  మందం లో మంచు పేరుకు పోయేంత .ఈ దశలో ఓ కీలక మైన మార్పు చోటు చేసుకుంది.అతి నీల లోహిత కిరణాల కారణంగా మంచు పొరల్లో H2O2  ఉత్పత్తి అవుతుంది.సాధారణంగా నయితే సూర్య రశ్మి సోకినప్పుడు H2O2 నాశనం అవుతుంది.అప్పట్లో భారీ స్థాయిలో మంచు పొరలు ఉండటం వలన  లోపలి పొరల్లో కొద్దిపాటి H2O2  అలాగే  ఉండి పోయింది. మంచు గ్రహంగా పేరొందిన గురుగ్రహం పై కూడా H2O2 ఆనవాళ్ళు ఉన్నట్టు శాస్త్ర వేత్తలు గుర్తించారు.
    మంచుయుగం ముగిసినప్పుడు H2O2 వాతావరణంలోకి సముద్రాల్లోకి విడుదలయ్యింది .ఇది కూడా దశల వారిగా నెమ్మదిగా జరగడం వలన అప్పటికి ఆక్షిజన్ లేకుండానే బ్రతికేస్తున్న ప్రాణులకు హాని జరగలేదు.కాక పోతే ఈ రకమైన పరిస్థితికి అలవాటు పడేలా ఈ ప్రాణులు కొన్ని enzymes ను తయారు చేసుకోవడం వీలయ్యింది .పరినామ క్రమంలో జీవులు ఈ enzymes ఆధారంగా ఆక్షిజన్ ను ఉత్పత్తి చేయడం మొదలు పెట్టాయి .ఇలా భూమికి పచ్చదనం అబ్బింది అన్నమాట .
(ఈనాడు పత్రిక ఆధారంగా ,వారికి కృతజ్ఞతలు .) 

No comments:

Post a Comment