శాస్త్రీయ దృక్పథం

విజ్ఞానశాస్త్ర అభిమానులకు "విజ్ఞానశాస్త్రము"బ్లాగు స్వాగతం ఈ బ్లాగు ప్రజలలో,విద్యార్థులలో ఉపాధ్యాయులలో శాస్త్రీయదృక్పథాన్ని పెంచుటకు ఉద్దేశించబడినది.

Friday 5 October 2012

జీవ వైవిధ్యం దెబ్బతింటే ఏమి జరుగుతుంది? 1



          పంటల వైవిధ్యం దెబ్బ తిన్నది.జొన్న,సజ్జ,రాగి,కొర్ర అంతరిస్తున్నాయి.వీటిల్లో ఉన్న పోషకాలతో పశువులు బ్రతుకుతున్నాయి.వాటి విసర్జితాలు పొలానికి బలమైన ఎరువులు.ఒకప్పుడు రైతు 10,000 రకాల పంటలు పండిం చేవాడు.ప్రస్తుతం  200 లోపే పండింస్తున్నాడు.ఈ గింజలను పక్షులు,జంతువులు అన్నీ తింటాయి.కానీ ఇప్పుడు అన్నీ వాణిజ్య పంటలే!లక్షలు పోసినా పంటకు దిక్కు లేదు.బహుళజాతి విత్తనాలు,రసాయనాలు,క్రిమి సంహార కాలు మట్టిని విషంగా మారుస్తున్నాయి.వాన పాములు,ఎండ్ర కాయలు అంతరిస్తున్నాయి.
         దోమల గుడ్లు కప్పలు తినేవి.కప్పల్ని పాములు తినేవి.పాముల్ని గద్దలు వేటాడేవి.పిచ్చుకలు మిడతలదండు   ను తిని పంటను కాపాడేవి.ఈ చక్రం మనిషి స్వార్ధానికి చిన్నాభిన్నం అవుతుంది.పాములతోలు తో ఫ్యాషన్ వస్త్రాలు  తయారు చేస్తున్నారు.గద్దలకు ఆహారం కరవైంది.ప్రతి 20 నిముషాలకు ఒక జీవ జాతి అంతరించి పోతుంది.
      cell phone towers radiation వలన ఇప్పటికే పిచ్చుకలు అంతరిస్తున్నాయి.కొండలపైకూడా ఏర్పా టు చేయటం తో తేనెటీగలు కూడా నాశనం అవుతున్నాయి.ప్రకృతి కోసం సాంకేతికతను ఉపయోగించాలి పారిశ్రామిక వ్యర్తాల్ని తగ్గించి,కాలుష్యాన్ని నివారించి,చెత్తను సద్వినియోగం చేసుకుంటే ప్రకృతి స్వచ్చంగా మారుతుంది.జీవ వైవిధ్యానికి నష్టం  కలిగించకుండానే ఆర్ధిక ప్రగతి సాధించడానికి చాలా మార్గాలున్నాయి.
       సృష్టిలో మూడు కోట్ల వృక్ష జంతు జాతులున్నాయి.ఇప్పటికి గుర్తించింది15 లక్షలు మాత్రమే!అధిక జనాభాను నియంత్రించుకోవాలి.ఇదే వేగంతో జనాభా పెరిగితే అడవి జంతువులనే కాదు.తోటి మనుషుల్ని పీక్కు తినాల్సి వస్తుం ది.అడవుల్ని,జంతువుల్ని,నదుల్ని,సముద్రాలను,ధ్వంసం చేయటం వలన కాలుష్యం,కరువు కాటకాలు,మాయ రోగాలు,green house effect దాపురిస్తున్నాయి.

No comments:

Post a Comment