శాస్త్రీయ దృక్పథం

విజ్ఞానశాస్త్ర అభిమానులకు "విజ్ఞానశాస్త్రము"బ్లాగు స్వాగతం ఈ బ్లాగు ప్రజలలో,విద్యార్థులలో ఉపాధ్యాయులలో శాస్త్రీయదృక్పథాన్ని పెంచుటకు ఉద్దేశించబడినది.

Friday 8 November 2013

నోబెల్ హుమతి పొందిన భారతీయులు

 1) రబీంద్రనాధ్  టాగూర్(1913,సాహిత్యం) :గీతాంజలి అనే కావ్యానికి ఆయనకు ఈ బహుమతి వచ్చింది. ఈ బహుమతి అందుకున్న తొలి భారతీయుడు ఈయనే !
2) సి.వి. రామన్ (1930,భౌతిక శాస్త్రం ); కాంతిని ప్రసరింపజేసి పదార్థాల ధర్మాలను గ్రహించ వచ్చని రామన్ ఎఫెక్ట్ ద్వారా నిరూపించారు.సైన్స్ రంగంలోనోబెల్ సాధించిన శ్వేతజాతీయేతరుడు ఈయనే !
3):హరగోబింద్  ఖోరానా (1968,వైద్య రంగం): జన్యువుల్లో జీవ సంకేతాలు ఏ క్రమంలో ఉంటాయో విశ్లేషించినందుకు ఈయన ఈ బహుమతి పొందారు. 
4)మదర్ థెరెసా(1979,శాంతి):పేదలకు వ్యాధిగ్రస్తులకు సేవలు అందించినందుకు శాంతి పురస్కారం అందుకున్నారు.
5)సుబ్రమనియం చంద్రశేఖర్(1983,భౌతిక శాస్త్రం ):ఈయన సి.వి రామన్ సోదరుని కుమారుడు.ఈయన ఖగోళ భౌతి క శాస్త్రంలో చంద్రశేఖర్ లిమిట్ పేరుతో ఓ సిద్దాంతాన్ని ప్రతిపాదించారు.నక్షత్రాల పుట్టుక,పరిణామాల పై ఇది వివరి స్తుంది.నాసా ఈయన పేరుతో ( చంద్ర ఎక్స్ రే) ఒక అబ్జర్వేటరీ ని ప్రయోగించింది.
6) అమర్త్యసేన్(1998,అర్థ శాస్త్రం): ఆర్ధిక సంస్కరణలకు ముందు జనసంక్షేమాలయిన విద్య,వైద్యం,ఆహార లభ్యత వంటివి సంస్కరించి నప్పుడే నిజమైన ఆర్ధిక పురోభివృద్ది సాధ్యమని ప్రభుత్వాలు,ఐక్యరాజ్య సమితి గుర్తించేలా చేయ్యటం వలన ఈ బహుమతి సాదించారు.
7)వెంకటరామన్ రామకృష్ణన్ (2009,రసాయన శాస్త్రం ): రైబోజోం  జీవానికి,శారీరక గమనానికి కణ స్థాయిలో అత్యంత కీలక మైన సంకేతం.దీని గుట్టుమట్లు విప్పినందుకు ఈ పురస్కారానికి ఎంపికయ్యారు .
8) వి.యెస్ నైపాల్ :(సాహిత్య్హం 2001) ఈయన భారతీయ సంతతి వారు.
9)ఆర్.కె పచౌరీ :నోబెల్ శాంతి బహుమతి అల్గోరెతో కలిసి పంచుకున్నారు.

2 comments:

  1. Ronald Ross was born in India.
    He discovered that Malaria is caused by Mosquito.Awarded Noble in 1903.
    He did his research in Secunderabad Contonment
    He was a military doctor.

    ReplyDelete