శాస్త్రీయ దృక్పథం

విజ్ఞానశాస్త్ర అభిమానులకు "విజ్ఞానశాస్త్రము"బ్లాగు స్వాగతం ఈ బ్లాగు ప్రజలలో,విద్యార్థులలో ఉపాధ్యాయులలో శాస్త్రీయదృక్పథాన్ని పెంచుటకు ఉద్దేశించబడినది.

Wednesday 7 October 2015

మన ముత్తాతల్ని వెతకొచ్చు

             8 తరాల కిందట చీకటిఖండ మైన ఆఫ్రికా నుంచి మన దేశానికి వచ్చిన సిద్ధిస్ లు ఆఫ్రో ఇండియన్స్ అని తేలింది.5 వేల ఏండ్ల క్రిందట చీకటి ఖండంలో బంటు జాతులుగా గుర్తింపు పొందారు.వారు అటునుంచి 2500 ఏండ్ల క్రిందట సముద్ర మార్గం ద్వారా ఆ దేశాన్ని వీడారని ఆధారాలతో బయట పెట్టింది CCMB(centre for cellular and molecular biology).15 నుంచి 19 శతాబ్దాల మధ్య వీరంతా మన దేశంలోని గుజరాత్,కర్నాటకల్లో అడుగు పెట్టారు.అటునుంచి  హైదరాబాద్ కు చేరుకొని చార్మినార్ వద్ద స్థిర పడ్డారు.నల్లటి చర్మం,రింగులు తిరిగిన జుట్టు మలేరియా దోమ కాటులను తట్టుకునే వారే sidhdhis లని తేలింది.ప్రస్తుతం వీరు పహిల్వాన్లుగా వున్నారు.
          తాజాగా మరో పరిశోధనలో ఐరోపాకు మన దేశానికి మధ్య బందుత్వాన్ని నిరూపించింది.ఐరోపాలో వుండే జిప్పీ లపై పరిశోధించారు.25 వేల ఏండ్ల క్రిందట దక్షిణ భారత దేశం నుంచి ఉత్తరాదికి అటునుంచి ఐరోపా దేశాలకు వెళ్ళిన మన దళితులు జిప్సీలుగా మారినట్లు తెలిసింది.
  వై క్రోమోజోం:
మానవ దేహం ఏర్పడటానికి X,Yక్రోమోజోం లు ప్రధాన పాత్ర పోషిస్తాయి .స్త్రీ లలో X  క్రోమోజోం లే ఉండగా పురుషులలో రెండు రకాలు ఉంటాయి.ఇందులో Y క్రోమోజోం వ్యక్తీ పుట్టుకకు కీలక భూమిక వహిస్తుంది. దాన్ని విశ్లేషిస్తే తరాల రహస్యాన్ని చేదిస్తుంది.CCMB  శాస్త్ర వేత్తలు  DNA మార్కింగ్ విధానం
ద్వారా జన్యువుల సమాచారం తెలుసుకుని మానవ సమాజాల మూలాల్ని వెతికి పట్టుకుంటున్నారు.
  CH.Mohan Rao,director,Deepa selvarani,scientist ,K.Thangaraj,A.GReddy,Rakesh thamang,Neeraj  ఈ ప్రాజెక్ట్ పై పరిశోధనలు నిర్వర్తిస్తున్నారు .వారిని అభినందిద్దాము .
(ఈనాడు వారికి ధన్యవాదాలు )

No comments:

Post a Comment