శాస్త్రీయ దృక్పథం

విజ్ఞానశాస్త్ర అభిమానులకు "విజ్ఞానశాస్త్రము"బ్లాగు స్వాగతం ఈ బ్లాగు ప్రజలలో,విద్యార్థులలో ఉపాధ్యాయులలో శాస్త్రీయదృక్పథాన్ని పెంచుటకు ఉద్దేశించబడినది.

Wednesday 16 May 2012

ప్రకృతి సూత్రాలు: 9 వ సార్వత్రిక నియమం


              అన్ని సంఘటనలలోను ద్రవ్య-శక్తి నిత్యత్వమే!.పదార్థం -శక్తి రూపాల్లో మారవచ్చునే గానీ పదార్ధం-శక్తి పరిమాణం సంఘటనకు ముందు సంఘటన తర్వాత ఒకే విధంగా వుంటాయి.సంఘటనలలో పదార్ధం -శక్తిని నూతనం గా సృష్టించలేము.నాశనం చేయలేము.
(Matter-Energy are Conserved During Any Process.Energy and Matter May change Their forms but the Net Quantity of Matter-Energy is fixed During all Processes..Matter-Energy can Neither be Created Nor Destroyed During Processes.)
         ఈ విశ్వం లో ఉన్న మొత్తం పదార్థం,మొత్తం శక్తిని కలగలిపి ద్రవ్య-శక్తి లేదా పదార్ధం -శక్తి అంటారు.శక్తి కూడా ఓ రకమైన పదార్థ రూపమే.శక్తికి ద్రవ్యానికి మధ్య  E=mc2(c squred). అనే అనుసంధానం ఉంది.విశ్వం లో ఉన్న కనిపిం చని,కనిపించే ద్రవ్యశక్తి మొత్తం 1500 కోట్ల సంవత్సరాల క్రితం ,నేడు ,రేపు స్థిరంగా ఉంటుంది.ఉదా:విత్తనం మొక్క గా మారిన సంఘటన ,ఇనుము త్రుప్పు పట్టు సంఘటన .ఈ రెండు సంఘటనల్లో ద్రవ్య-శక్తి నిత్యత్వ సూత్రం వర్తిస్తుంది.
                సంఘటనకు ముందున్న ద్రవ్య-శక్తి=సంఘటన తరువాత ద్రవ్య-శక్తి
శక్తి నుంచి పదార్థాన్ని ,పదార్థాలనుంచి శక్తిని సృష్టించగలం.ద్రవ్య-శక్తి నిత్యత్వసూత్రానికి  విరుద్ధంగా ఇంతవరకు మానవ చరిత్రలో ఏ సంఘటనా జరిగిన దాఖలాలు లేవు.గాలి లోంచి వస్తువులు సృష్టించడం ,టెలిపతి ,భూతవైద్యం బాణామతి,యోజనం,దయ్యాలు,పునర్జన్మ,ఆత్మ అనే భావనలు పై నియమం ప్రకారం రుజువు చేయలేరు . 

No comments:

Post a Comment