శాస్త్రీయ దృక్పథం

విజ్ఞానశాస్త్ర అభిమానులకు "విజ్ఞానశాస్త్రము"బ్లాగు స్వాగతం ఈ బ్లాగు ప్రజలలో,విద్యార్థులలో ఉపాధ్యాయులలో శాస్త్రీయదృక్పథాన్ని పెంచుటకు ఉద్దేశించబడినది.

Monday, 31 March 2014

మానవ జీవన ప్రస్థానం ఏ దారుల్లో ? ఏ తీరుల్లో ?

       ఆఫ్రికాలో ఆవిర్భవించిన  మానవుడు భూమండలమంతటా ఎలా విస్తరించాడన్నది  అతిపెద్ద సైన్స్ మిస్టరీల్లో ఒకటి.1987 లో కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం శాస్త్ర వేత్త అల్లెన్ విల్సన్జన్యు విశ్లేషణల ఆధారంగా జరిపిన పరిశోధనతో  చరిత్రకు 2 లక్షల ఏళ్ల వయసుందని తేలింది.దాదాపు 50000 ఏళ్ళ  క్రితం తొలుత ఆసియా, ఆ తర్వాత ఆస్ట్రేలియా తదుపరి యూరప్,చివరగా అమెరికా భూభాగాలను  చేరుకున్నారు.3 రకాల ఆధారాల వల్ల ఇది తెలి సింది. 1)పురావస్తు అవశేషాలు 2)జన్యు విశ్లేషణలు 3)  సాంస్కృతిక చిహ్నాలు 
1) మారుమూలన ఉన్న గుహల్లో,విస్తారమైన తీర ప్రాంతాల్లోలభించిన శిలాజాలను అధ్యయనం చేయటం ద్వారా ఆయా ప్రాంతాలకు  ఎప్పుడు వచ్చాడో తెలిసింది .

2) ఇక రెండో దైన జన్యు విశ్లేషణల విషయానికి వస్తే వలస వెళ్ళిన వాళ్ళు తమతో పాటు  తమ పూర్వీకుల జన్యు  ఉత్పరి వర్తనాలను తీసుకెళ్ళారు . ఉదాహరణకు M 130 అనే జన్యు సంకేతం మలేషియా ప్రజల్లో 10% ఉంటె ,న్యుగినియాలో 15% ఆస్ట్రేలియాలో 60% ఉంది.అంటే వరుసగా  ఈ  ప్రాంతాల  ద్వారా వలసలు జరిగాయని స్పష్ట మైంది . అండమాన్ దీవుల ప్రజల మైటో కాండ్రియా ను పరిశీలించటం  ద్వారా ఆ ప్రాంతానికి మనుషులు తొలిసారిగా 55-65 వేల  ఏళ్ళ క్రితం వచ్చి ఉంటారని తెలిసింది.3 వ విషయానికి వస్తే తీర ప్రాంతాల్లో లభించిన సముద్ర గుల్లలు,రాతిపరికరాలు కొన్ని వివరాలను అందించాయి.ఇది మనిషి ప్రయాణించిన కాలం ,మార్గం .


 ఎందుకు ?
 stanford  విశ్వ విద్యాలయం లోని క్లయిన్ ఇలా వివరణ ఇస్తారు. 50 వేల ఏళ్ళ క్రితం ఆఫ్రికాలో ఉన్న ప్రజల  ఆలోచనా ధోరణిలో ఆకస్మిక మార్పులు వచ్చాయి.  దీనికి  కారణం భాషకు సంబంధించిన FOXP 2 అనే  జన్యువు .దీని వలన మనుషుల ఆలోచనా సరళి,అనూహ్యంగా మారి ఇతర ప్రాంతాలు వలస వెళ్ళటానికి అనువైన పరిస్థితులు ఏర్పడ్డాయి.ఇంకో వాదన ప్రకారం 80-70 వేల ఏళ్ళ క్రిందటే సాంకేతిక సామాజిక మార్పులు సంభవించాయి.మనిషి జీవన స్థితి మెరుగవటంతో విపరీతంగా పెరిగి దక్షిణ ఆసియా వైపు విస్తరించటం ప్రారంభించింది.ఇదే మానవ మహాప్రస్థానానికి నాంది అంటారు మెల్లర్స్.వాతావరణ మార్పులు
కూడా ఒక కారణం అంటారు .
(ఈ వ్యాసం ఈనాడు నుండి   సేకరించినది వారికి ధన్యవాదాలు )

Sunday, 23 February 2014

శాస్త్ర వేత్తలకు ప్రతిమలు

               మనం  సాధారణంగా ఎక్కడైనా స్వాతంత్ర్య సమర యోధుల,నాయకుల విగ్రహాలు విగ్రహాలు   చూస్తుం టాము.గుంటూరు జిల్లా బాపట్లలో dr దొప్పల పూరి మల్లిఖార్జున రావు గారు ప్రముఖ శాస్త్ర వేత్తల,తత్వ వేత్తల కాంస్య విగ్రహాలను ప్రతిష్టించారు.దీని కోసం తన ఇంటి ప్రాంగణాన్ని కేటాయించారు .సెలవుల్లో విద్యార్థులు ఉపాధ్యాయులను  ఇక్కడకు తీసుకు వచ్చి  శాస్త్ర రంగం పై ఆసక్తిని పెంపొందించాలన్నధ్యేయంగా ఈ museum ప్రారంబించారు.
        2005 బాపట్ల విజయలక్ష్మి పురం లో తన గృహాన్ని ఏకంగా సైన్స్ museum గా మార్చారు.ఇందులో డార్విన్ ఉద్యానవనాన్ని ఏర్పాటుచేశారు.ఖగోళ శాస్త్రం పై అవగాహనకు 2009 నుంచి home theatre ను 100  dvd  లను ప్రదర్శిస్తున్నారు.వీటిని శని ఆదివారాల్లో ఉదయం సాయంత్రం ఓ గంట సేపు ప్రదర్శిస్తారు. కొపెర్నికస్,కారల్ మార్క్స్,డార్విన్,గెలీలియో,న్యూటన్,einstein మొదలగు వారి విగ్రహాలు ఏర్పాటు చేసారు.charless darwin ట్రస్ట్ ఏర్పాటుచేసి 50 లక్షలు డిపాజిట్ చేసారు.ఈయన స్పూర్తి తో "forum for better bapala " పాటశాలల్లో scientist ల విగ్రహాలు ఏర్పాటు చేస్తుంది .
                ఈ వినూత్న మైన ప్రయత్నాన్ని అందరూ అభినందించాలి .

Sunday, 16 February 2014

నోబెల్ విజేత వెంకటరామన్ రామకృష్ణన్ మాటల్లో సైన్స్

                ఈ మధ్య కాలంలో నోబెల్ బహుమతి  సాధించిన భారతీయుడు వెంకట రామన్ రామకృష్ణన్ .భౌతిక శాస్త్రంలో phd చేసి,జీవ శాస్త్రంలో పరిశోధనలు చేసి  రసాయన శాస్త్రంలో నోబెల్ సాధించిన ప్రతిభావంతుడు  ఈయన . చదువు గురించి,సైన్స్ గురించి ఆయన మాటల్లోనే విందాం.
         "సైన్స్ మీద నాకు ఆసక్తి కలగడానికి మా ఉపాధ్యాయుడు టి .సి పటేల్ కారణం.ఆయన పుణ్యమా అని సైన్స్ లో ప్రాధమిక అంశాలను పూర్తిగా అవగాహన చేసుకోగలిగాను.యూనివర్సిటీ స్థాయిలో మా ప్రొఫెసర్స్ నాణ్య మైన విద్య చెప్పిన కారణంగానే నేనీ రోజు ఈ స్థాయికి చేరుకోగాలిగాను.బరోడా మెడికల్ కాలేజీలో సీట్ వచ్చినా ఫిజిక్స్ లో నాకున్న ఆసక్తి కారణంగా మెడిసిన్ సీట్ వదులుకున్నాను. ఫిజిక్స్ లో phd చేస్తున్నప్పుడు www.scientificamerican.com scientificamerican magazine చదువుతుండే వాణ్ని సైన్స్ కు సంబంధించిన అద్భుత ఆవిష్కరణలు అందులో వ్రాసేవారు.వాటిలో ఎక్కువ భాగం జీవ శాస్త్రానికి చెందిన వ్యాసాలు  ఉండటం వల్ల నా దృష్టి ఫిజిక్స్ నుండి జీవ శాస్త్రం వైపు మళ్ళింది.జీవితంలో నన్ను ప్రభావితం చేసిన వారిలో ముఖ్య మైన వ్యక్తీ రైబొజొము ల అంశం పై పరిశోధనలకు పురికొల్పిన పీటర్ మూర్.
         భారత దేశంలో విద్యా వ్యవస్థ గురించి తలచుకుంటే బాధగా ఉంటుంది. పిల్లలకు ఎంతసేపు చదువే లోకం బళ్ళో ఇంట్లోtution లో చదువు..చదువు. ఆడుకోవడానికి,సృజనాత్మక శక్తిని పెంచుకోవడానికి సమయం ఎక్కడిది! పాఠ్యపుస్తకాలు కాకుండా  పుస్తకాలు చదివే అలవాటు,వళ్ళు అలిసిపోయేలా మైదానంలో ఆడుకోవడం ఇవేవీ ఇప్పటి పిల్లలకు తెలియకుండా పోతున్నాయి బట్టీ పట్టే చదివే  చదువులతో  సైన్స్ లో మనకు ప్రపంచస్థాయి పుర స్కారా లెక్కంన్నించి వస్తాయి.నా ఉద్దేశం ప్రకారం పిల్లకు ఎంత తక్కువ homework ఇస్తే అంత మంచిది. ప్రముఖ ఆర్ధిక వేత్త అమర్త్యసేన్ అసలు పిల్లలకు homework  వద్దంటాడు.బాల్యాన్ని హరించే కోచింగ్ సెంటర్స్ ను పూర్తిగా నిషేదించాలంటారు. ప్రతిదాన్ని ప్రశ్నించి తెలుసుకునే మనస్తత్వం,ఆటా,పాటా ...పిల్లల్లొ సృజనాత్మకతను పెంచుతా యని చెబుతారాయన. school లో టీచర్స్ చక్కగా అర్థ మయ్యేలా చెప్పగలిగితే మనం కూడా శ్రద్ధగా మనసు పెట్టి పాఠాలు వింటే కోచింగ్ సెంటర్ల అవసరమే ఉండదు.
          సైన్స్ విద్యార్థులకు నేనిచ్చే సలహా ఏమిటంటే మీకు సైన్స్ మీద ఎంతో ఇష్టం, తపన ,ఆరాధన ఉంటేనే ఆ సబ్జెక్టు తీసుకోండి .ఒక్క సైన్స్ అనే కాదు ఏ సబ్జెక్టు అయినా అంతే . మీకు ఆసక్తి ఉన్న చదువు చదివితేనే దానికి సార్ధకత" .
     విద్యార్థులూ! ఆయన చెప్పిన మాటలు విన్నారు కదా!పాటిస్తారు కదూ !schools యాజమాన్యాలు కూడా గ్రహించ వలసిన విషయాలు ఆయన చెప్పారు .
  (ఈ వ్యాసం ఈనాడు ఆదివారం అనుబంధం లోనిది , వారికి ధన్యవాదాలు )
  వెంకటరామన్ రామకృష్ణన్ http://www.nobelprize.org/nobel_prizes/chemistry/laureates/2009/ramakrishnan-bio.html
పై లింక్ లో ఆయన గురించి తెలుసుకోండి .

Wednesday, 25 December 2013

ఇంట్లో రోజుకొక యూనిట్ విద్యుత్ పొదుపు చేయటం ఎలా?


ఈ క్రింది నియమాలు పాటించటం ద్వారా రోజుకొక యూనిట్ విద్యుత్ ఆదా చెయ్యవచ్చు .
1) పగటి వేళ  దీపాలు వెలిగించ వద్దు.     
2) గదిని వదిలినా,ఇంటిని వదిలినా దీపాలు,పంఖాలు ఆర్పి వెళ్ళండి. 
3) t.v,కంప్యూటర్,microvave ,వి.సి ఆర్ ,d.v.d వంటి వాటిని main switch  వద్ద ఆపండి .
3) CFL బల్బులు వాడండి ఇవి తక్కువ వాటేజితో ఎక్కువ వెలుగు నిస్తాయి. 
4) FANS కి ELECTRONIC REGULATOR వాడండి . ఫ్రిజ్ లకు  సరిపోయే ధర్మోస్టాట్ అమర్చండి ఫ్రిజ్ ను తరచూ ఎక్కువ  సేపు తెరచి ఉంచవద్దు .
5) ఇంటిలో నీరు ఆదా చేయండి వాటిని మోటార్ ద్వారా పైకి తోడుతున్నామని గుర్తించండి .
      రోజుకు ఒక యూనిట్ అంటే నెలకు 30 యూనిట్స్ ఆదా చేస్తే  ఏడాదికి 1800 --2000 రూపాయలు విద్యుత్ బిల్లు తగ్గుతుంది .ఇలా చేస్తే ఆంధ్రప్రదేశ్ లో ఉండే 30 లక్షల మంది మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వినియోగ దారుల ద్వారా నెలకు 9 కోట్ల యూనిట్స్  విద్యుత్ ను అనగా రు 4.50 చొప్పున 40-50 కోట్ల రూపాయలు ఆదా చేయగలము.పవర్  హౌస్ వద్ద రు 1440 కోట్ల మూల ధనం ఖర్చు కాగల 240 మెగా వాట్స్ సామర్థ్యము తో సమానం.నెలకు లక్ష టన్నుల బొగ్గు అనగా ఏటా 12 లక్షల టన్నుల బొగ్గు వనరు ఆదా అన్నమాట.ఈ ఆదా పర్యావరణంలో 18 లక్షల టన్నుల co2 కాలుష్యాన్ని తగ్గిస్తుంది.
   ఈ విషయాలు గ్రహించి పొదుపు సూత్రాలు పాటించి రోజుకో యూనిట్ ఆదా చేద్దాం .

Sunday, 1 December 2013

ఎక్కడిదీ జీవం ?

             ఈ సృష్టిలోనే ఒక క్రమాన్ని దర్శింపజేస్తూ మనల్ని ఈ విశ్వాసాల స్థాయి నుంచి ఒక క్రమబద్ద మైన శాస్త్రీయ దృక్పథం వైపు మరల్చిన మహనీయుడు చార్లెస్ డార్విన్. చుట్టూ కోటాను కోట్ల జీవరాసుల మధ్య .. మన ఈజీవం జీవితం ఎక్కడినుంచి వచ్చాయన్నది .. మనిషికి ఒక పట్టాన అంతుబట్టని నిగూఢమైన ప్రశ్న!తన ఊహకు కూడా అందని అమోఘమైన శక్తి ఈ సృష్టి యావత్తును ఒక్కసారిగా అద్భుతంగా సృష్టించి ఉంటుందని విశ్వసించాడు ఆది మానవుడు.అందుకే ప్రతి ప్రాచీన మతంలోను సృష్టి ప్రస్తావన కన్పిస్తుంది.కొన్ని వేల సంవత్సరాలపాటు సృష్టి దాని క్రమం విషయంలోమతం చెప్పిందే సమాధానం,మత గ్రంధం చెప్పిందే వేదంగా చెలామణి అయ్యింది. ఈ దిశగా  శాస్త్రీయదృక్పథం ఊపిరిపోసుకోవటానికి కొన్ని శతాబ్దాలపాటు అదే పెద్ద ప్రతిబంధకంగా నిలిచింది .
                  17,18 శతాబ్దాలలో కోపెర్నికస్,గెలీలియో,న్యూటన్ వంటి ఉద్దండులు విశ్వ నిర్మాణం విషయంలో కొత్త సిద్ధాంతాలను ముందుకు తెచ్చి మత విశ్వాసాలకు బలమైన సవాలు విసిరారు.ఈ విశ్వాన్ని నడిపిస్తున్న సూత్రాలే మిటో .. లోతుగా పరికిస్తే మనకు ఈ విశ్వం లోనే కన్పిస్తాయని నిరూపించారు.దీంతో మతం చెప్పిందే  విశ్వసించట మా?లేక సైన్స్ మార్గాన్ని అనుసరించటమా? అన్నది ప్రజల్లో పెద్ద చర్చనీయాంశం అయింది.జీవపరిణామ సిద్ధాంతం ఊపిరి పోసుకోవటానికి ఇది ఎంతగానో దోహద పడింది .
              దాదాపు 1700 నుంచి శాస్త్రవేత్తలు భూమి పొరల్లో అక్కడక్కడ శిలాజాలను గుర్తిస్తూ వచ్చారు. క్రమేపీ శి లాజాలను చూస్తూ అది ఏ జంతువుకు చెందిందో గుర్తించే నైపుణ్యమూ పెరిగింది.అందులో కొన్ని రకాలు ప్రస్తుతం లేవని గుర్తించారు జార్జి కువిర్(1769-1832) అనే ఫ్రెంచ్ ప్రకృతి పరిశోధకుడు. గతం లోని కొన్ని జంతువులు అంత రించి  పోయాయాని ప్రతిపాదించటం మొదలుపెట్టారు. తర్వాత "అంతరించి పోవటం" అన్నది డార్విన్ సిద్దాంతానికి ముఖ్య భూమిక అయింది .
                  అప్పట్లో ప్రజలు దేవుడు చేసిన ఈ సృష్టిలో ఎలాంటి మార్పులకు తావు లేదని నమ్మేవాళ్ళు. యుగాం తంలో మాత్రమే సర్వం తుడిచిపెట్టుకుని పోయి మరల కొత్త జీవజాలం పుడుతుందని నమ్మేవాళ్ళు. అప్పట్లో ప్రయా ణ  సాధనాలు ఏవీ లేకపోవటం వల్ల తమ ప్రాంతం లోని జీవాన్ని చూస్తూ జీవంలో మార్పు ఉండదు అనుకునే వారు  పారిశ్రామిక విప్లవం తర్వాత ప్రయాణాలు పెరగటంతో వేర్వేరు ప్రాంతాల్లోని జీవ వైవిధ్యాన్ని గమనించటం వల్ల కొత్త ఆలోచనలకు స్థానం ఏర్పడింది.
              మత గ్రంధాలు చెప్పినట్లుగా ఒక్క సారిగా మహా ప్రళయాలు రావటం లేదని అవి క్రమేపీ కొన్ని వందల వేల సంవత్సరాలపాటు నిరంతరాయంగా జరుగుతూనే ఉంటున్నాయని బ్రిటిష్ భూభౌతిక శాస్త్ర వేత్త   చార్లెస్ లిల్ (1797-1875) సశాస్త్రీయంగా ప్రతిపాదించాడు. డార్విన్ తన పరిణామ సిద్దాంతానికి ఒక రూపు ఇవ్వటంలో ఇది ఎంతగానో ఉపకరించింది.
(ఇది ఈనాడు లో A .వెంకట ఆచార్య వ్రాసిన వ్యాసం. వారికి ధన్యవాదాలు )

Saturday, 16 November 2013

విదేశాల్లో భారత ఆణిముత్యాలు


1) క్వాంటం కంప్యూటింగ్:   ఉమేష్ వజిరాని దీనిపై పరిశోధనలు చేస్తున్నారు.క్వాంటం కంప్యూటర్లు సిలికాన్ చిప్ లతో కాకుండా హైడ్రోజెన్ అణువులతో పనిచేస్తాయి.

2) విశ్వం ఎలా పుట్టింది?:  శ్రీనివాస కులకర్ణి లాస్ ఏంజెల్స్  దగ్గరలోని kaaltech యూనివర్సిటీ లో ఆస్ట్రో ఫిజిక్స్ శాస్త్ర వేత్తగా పనిచేస్తున్నారు.విశ్వం పుట్టుక రహస్యాన్ని చేధించటానికి గామా కిరణాల గురించి పరిశోధనలు చేస్తున్నారు.

3)మూర్చ : Dr హితేన్ జవేరీ మూర్చను నియంత్రించటానికి pacemaker లాంటి సాధనాన్ని కనిపెట్టాలనే లక్ష్యం  తో పనిచేస్తున్నారు.
 
4) మనుషులకు జంతువులకు మధ్య తేడా!: ఈ తేడాను వివరించేందుకు తద్వారా మానవ పరిణామం లోని చిక్కుముడులు విడగొట్టెందుకు కాలిపోర్నియా యూనివర్సిటీ కి చెందినా అజిత్ వర్కీ  ప్రయత్నిస్తున్నారు. ఇందుకై ఆయన తనపైనే ప్రయోగం చేసుకున్నారు.ఈ అధ్యయనానికి గ్లైకో బయాలజీ అనిపేరు పెట్టారు .

5) అతి సూక్ష్మ మైన జెట్ ఇంజెన్స్ ద్వారా ఎలెక్ట్రానిక్  పరికరాలకు విద్యుత్ ను అందించే టెక్నాలజీ ని అమిత్ మెహ్రా రూపొందిస్తున్నారు. ఇది ఇంధనం లోని రసాయన శక్తిని విద్యుత్ గా మారుస్తుంది.

6) మందుల అభివృద్ధిలో పేరు పొందిన ఖోస్లా ప్రస్తుతం స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ లో celiac sprue  అనే ఆటో ఇమ్యూన్ జబ్బుపై పరిశోధనలు  పెట్టారు .

7) శరీరం లోకి చిన్న చిన్న క్యాప్సుల్స్ నిర్దేశించిన  మందులు వదిలేసే అంశం పై పరిశోధిస్తున్నారు,మల్లాప్రగ్గడ  సూర్య .ఈమెను  100 మంది అత్యుత్తమ ఆవిష్కర్తల్లో ఒకరిగా MIT ప్రస్తుతించింది. మధుమేహ రోగులకు ఇంజెక్షన్ల బాధ  తప్పించేందుకు బోస్టన్ యూనివర్సిటీలో biomedical ఇంజినీరింగ్ లో  ప్రొఫెసర్ గా ఉన్న తేజాల్ దేశాయ్ ప్రయత్నిస్తున్నారు.

8)Activematerials పై  ప్రొఫెసర్ కౌశిక్ భట్టాచార్య పరిశోధనలు ప్రపంచ ప్రఖ్యాతి నార్జించి పెట్టాయి లోహాలలో ఉన్న PATERN ను మార్చి మనకు నచ్చిన లోహాలను డిజైన్ చేసుకోగలమా? అని కాలిఫోర్నియా institute లో ప్రొఫెసర్ గా పని చేస్తున్న కౌశిక్ పరిశోధనలు ఫలిస్తే నానో టెక్నాలజీ రంగమే కొత్త మలుపు తిరుగుతుంది .

9) మెదడు ఏ విధంగా అభివృద్ది చెందుతుంది ?దీనిని ప్రభావితం చేసే అంశాలేమిటి? MIT లో బ్రెయిన్ and కాగ్నిటివ్ డిపార్టుమెంటుకు హెడ్ గా  పనిచేస్తున్న మృగాంక సుర్ చేసిన పరిశోధనలు కొత్త ఊపు నిచ్చాయి.

10) రోటో  వైరస్ చాలా ప్రమాదకరమైనది.ఈ విషయం పై టెక్సాస్ మెడికల్ సెంటర్ లో B.V.V  ప్రసాద్ పరిశొధిస్తున్నారు. 
  వీరందరి పరిశోధనలు ఫలించి నోబెల్ బహుమతులు పొందాలని ఆశిద్దాం .
(ఈ సమాచారం ఈనాడు పేపర్ నుండి సేకరించినది వారికి ధన్యవాదాలు )  

Friday, 8 November 2013

నోబెల్ హుమతి పొందిన భారతీయులు

 1) రబీంద్రనాధ్  టాగూర్(1913,సాహిత్యం) :గీతాంజలి అనే కావ్యానికి ఆయనకు ఈ బహుమతి వచ్చింది. ఈ బహుమతి అందుకున్న తొలి భారతీయుడు ఈయనే !
2) సి.వి. రామన్ (1930,భౌతిక శాస్త్రం ); కాంతిని ప్రసరింపజేసి పదార్థాల ధర్మాలను గ్రహించ వచ్చని రామన్ ఎఫెక్ట్ ద్వారా నిరూపించారు.సైన్స్ రంగంలోనోబెల్ సాధించిన శ్వేతజాతీయేతరుడు ఈయనే !
3):హరగోబింద్  ఖోరానా (1968,వైద్య రంగం): జన్యువుల్లో జీవ సంకేతాలు ఏ క్రమంలో ఉంటాయో విశ్లేషించినందుకు ఈయన ఈ బహుమతి పొందారు. 
4)మదర్ థెరెసా(1979,శాంతి):పేదలకు వ్యాధిగ్రస్తులకు సేవలు అందించినందుకు శాంతి పురస్కారం అందుకున్నారు.
5)సుబ్రమనియం చంద్రశేఖర్(1983,భౌతిక శాస్త్రం ):ఈయన సి.వి రామన్ సోదరుని కుమారుడు.ఈయన ఖగోళ భౌతి క శాస్త్రంలో చంద్రశేఖర్ లిమిట్ పేరుతో ఓ సిద్దాంతాన్ని ప్రతిపాదించారు.నక్షత్రాల పుట్టుక,పరిణామాల పై ఇది వివరి స్తుంది.నాసా ఈయన పేరుతో ( చంద్ర ఎక్స్ రే) ఒక అబ్జర్వేటరీ ని ప్రయోగించింది.
6) అమర్త్యసేన్(1998,అర్థ శాస్త్రం): ఆర్ధిక సంస్కరణలకు ముందు జనసంక్షేమాలయిన విద్య,వైద్యం,ఆహార లభ్యత వంటివి సంస్కరించి నప్పుడే నిజమైన ఆర్ధిక పురోభివృద్ది సాధ్యమని ప్రభుత్వాలు,ఐక్యరాజ్య సమితి గుర్తించేలా చేయ్యటం వలన ఈ బహుమతి సాదించారు.
7)వెంకటరామన్ రామకృష్ణన్ (2009,రసాయన శాస్త్రం ): రైబోజోం  జీవానికి,శారీరక గమనానికి కణ స్థాయిలో అత్యంత కీలక మైన సంకేతం.దీని గుట్టుమట్లు విప్పినందుకు ఈ పురస్కారానికి ఎంపికయ్యారు .
8) వి.యెస్ నైపాల్ :(సాహిత్య్హం 2001) ఈయన భారతీయ సంతతి వారు.
9)ఆర్.కె పచౌరీ :నోబెల్ శాంతి బహుమతి అల్గోరెతో కలిసి పంచుకున్నారు.

Saturday, 26 October 2013

కొత్త ఆలోచనలను ఆహ్వానించడమే శాస్త్రీయ దృక్పథం ...... N.Vital c.v.c మాజీ chairman

శాస్త్రీయ దృక్పథాన్ని అర్థం చేసుకోవాలంటే ముందుగా మానవ పరిస్థితులను,సమాజానికి మతానికీ  మధ్య  ఉన్న  సంబంధాల  గురించి  తెలుసుకోవాల్సి  ఉంటుంది.science రుజువులను కోరుతుంది.ప్రతిదాన్ని తార్కికంగా విశ్లేషిం చేందుకు ప్రయత్నిస్తుంది.అన్నిటిని  ఇతర జీవులతో వేరు చేసేవి 3 అంశాలు 1) నేర్చుకోగల సామర్ద్యం 2),విశ్లేషించ గలగడం 3)కొత్త అంశాలను కనుగొనగలగడం.చింపాంజీ మెదడు రెండు మూడేళ్ళలో ఎదిగితే మానవ మెదడు ఎది గేందుకు పదేళ్ళు పడుతుంది.బహుశా ఇందు వల్లనే మానవుడికి  ఇంత సమర్ధత  అబ్బిందేమో ? మతానికి సైన్సు కు ఉన్నసంబంధం యుగాలనాటిది.గెలీలియో ఆవిష్కరణను అప్పటి మత పెద్దలు ఎలా వ్యతిరేకించింది మనకు తెలిసిందే.అయితే  గతిశీల సైన్సు ఎప్పుడు మారుతూనే ఉంటుంది.
  .
        

Thursday, 24 October 2013

సైన్స్ లో శాశ్వత సత్యమంటూ లేదు ....రాజా రామన్న, సైంటిస్ట్

ఎన్నో సందేహాలు
ఎన్నో సంతాపాలు
జీవితంపు  చిక్కుముడులు
విడవెంతగ  సడలించిన ...
           ***
ఈ సృష్టికి ఏమర్థం  
మానవుని గమ్యమేది?
ఒక సకలాతీత శక్తి ఉన్నట్టా లేనట్టా

మెదడదన్నది మనకున్నది
అది సరిగా పనిచేస్తే
విశ్వ రహః పేటికా వి
పాటన  జరగక తప్పదు ...
                                     --శ్రీ శ్రీ
                                                  సైన్స్ లో  శాశ్వత సత్యమంటూ లేదు
                                                                    .........రాజా రామన్న సైంటిస్ట్ , మాజీ రక్షణ శాఖా మంత్రి
             సైన్స్ అన్నది ఎప్పుడు మారుతూనే  ఉంటుంది. ప్రతి యుగం లోను ఈ మార్పు మనకు ప్రస్పుటంగా కన్పిస్తుంది. శాశ్వత సత్యం అన్న భావనకు ఇక్కడ స్థానం లేదు.నా దృష్టిలో కొత్త ఆలోచనలను స్వీకరించే మనస్తత్వమే శాస్త్రీయ దృక్పథం . అయితే  మన దేశ ప్రజల్లో శాస్త్రీయ దృక్పథం ఉందా?అన్న ప్రశ్న వేసుకుంటే సంతృప్తికరమైన సమాధానం దొరకదు.ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటి విద్యా వ్యవస్థ కొనసాగుతూ  ఉండటం  విద్యార్థులు అంశాలను అర్థం చేసు కోకుండా వాటిని బట్టీ పట్టడం దీనికి కారణాలు శాస్త్ర రంగంలో అభివృద్ది అన్నది ఎవరికీ ఉపయోగపడుతోందన్న విషయాన్ని ఎప్పుడూ గమనించాలి. 

Tuesday, 22 October 2013

కొందరు మహనీయుల శాస్త్రీయ దృక్పథం

         .శాస్త్రీయ దృక్పధానికి పునాదులు వేసిన కొందరు మహనీయుల సాధన ,అనుభవాలు,ఆలోచనలు

ఐజాక్ న్యూటన్(1642-1727)
            ప్రపంచానికి నేనెట్లా కనిపిస్తానో తెలియదు కానీ నా మటుకు నేను సత్యం అనే సాగరం ముందు ఆడుకుంటూ ,ఏ గుండ్రటి గులకరాయినో ,అంద మైన గవ్వనొ  ఏరుకునే బాలునిగానే భావిస్తాను.

సి.వి రామన్ (1888-1970):
      నుదిటి  నుంచి  స్వేదం చిందకుండా చేసే పనికి విలువ లేదు.భారతీయ  మేధ  ఏ ఒక్కరికి తీసి పోదు. కానీ మనకు ధైర్యం పాలు తక్కువ. దేశంలో యువతకు కావలసింది అపజయాన్ని చవిచూస్తానన్న భయాన్ని శాశ్వతంగా నిర్మూలించడం ,విజయాభిలాషను పెంపొందించుకోవడం".    

రవీంద్రనాథ్ టాగూర్(1861-1941):
  ఈ అనంత విశ్వం తన రహస్యాలను తనలోనే ఇముడ్చు కోవాలని  ప్రయత్నిస్తుంటుంది కాని మానవుడు సామాన్యుడు కాదు. విశ్వం విసిరిన  సవాళ్ళను స్వీకరించి సృష్టి రహస్యాలను బహిర్గత పరిచి ,విశ్వం పై విజయం సాధించాడు .ఈ ప్రస్తానం లో  అనంత దూరాలను తనకు  దగ్గరగా  తెచ్చుకున్నాడు .కనరాని   శక్తులను వీక్షించాడు. వివరించలేని  ప్రక్రియల విశ్లేషణకు ఒక భాషను ఏర్పరుచుకున్నాడు .ఈ  సంకల్పం నెరవేరడానికి కావలిసిన అభిలాష భూమిపై కొందరికే ఉంటుంది .

జవహర్ లాల్ నెహ్రు(1889-1964):
               సుదీర్ఘ మైన చరిత్రలో మానవ జీవితం పై సైన్స్ చూపినంత ప్రభావాన్ని మరేదీ చూపలేదని నా నమ్మకం . సైన్స్ మనలను అనూహ్య మైన తీరాలకు తీసుకుని వెళ్ళింది .క్షీణ   దశలో ఉన్న ఆర్థిక వ్యవస్థను సమృద్ధి దిశగా రూపాంతరం చెం దిం చగల  సామర్థ్యం సైన్స్లు కు ఉన్న సంగతి అందరికీ తెలి సిందే ఇన్నాల్లూ తత్వ శాస్త్ర పరిధిలోని విషయాలు సైన్స్ పరిధి లోకి వచ్చాయి.స్థల కాలాల (space-time) భావన క్వాంటం సిద్ధాంతం భౌతిక ప్రపంచ అవగాహనలో మార్పు తెచ్చాయి.శాస్త్ర  అవగాహనతో మానవుడు తననూ  ప్రకృతినీ వేర్వేరుగా భావించడం లేదు.  మానవుని  తుది గమ్యం ప్రకృతిలోని శక్తులతో ముడి వడి ఉంది.

ఆల్బర్ట్ ఐన్ స్టీన్ (1879-1955):
సత్యాన్వేషణలో సైన్స్ ఇంకా బాల్య దశలోనే ఉంది ..కాని ఇంత వరకు సైన్స్ ద్వారా మనకు లభించిన విజ్ఞానం ఎంతో విలువైనది.